యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గుర్తున్నాడా? సుధీర్ బాబుతో తెరకెక్కించిన భలే మంచి రోజు చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్య అందరి నుండి ప్రశంసలు అందుకున్నాడు. విభిన్న కథతో, ఫుల్ ఎంటర్టైనర్ గా తొలి చిత్రాన్ని రూపొందించిన శ్రీరామ్ ఆదిత్య, రెండో ప్రయత్నంగా చేసిన శమంతకమణి యావరేజ్ గా ఆడింది. సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్ హీరోలుగా తెరకెక్కిన ఈ రాబరీ మిస్టరీ ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక మూడో చిత్రం నాని, నాగార్జున హీరోలుగా దేవదాస్ ను రూపొందించాడు. ఒక డాక్టర్, ఒక డాన్ మధ్య అనుబంధాన్ని ఈ చిత్రం ద్వారా చూపించాడు. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. దేవదాస్ తర్వాత శ్రీరామ్ ఆదిత్య నుండి మరో సినిమా ప్రకటన ఏదీ రాలేదు. అప్పటినుండి సైలెంట్ గా ఉన్న శ్రీరామ్ ఆదిత్య, దీపావళి సందర్భంగా తనకు మహేష్ బాబు నుండి గిఫ్ట్ అందిందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మహేష్ బాబు రీసెంట్ గా హంబుల్ అనే క్లోతింగ్ బ్రాండ్ ను లాంచ్ చేసిన సంగతి తెల్సిందే. హంబుల్ నుండి శ్రీరామ్ ఆదిత్యకు గిఫ్ట్ అందిందన్న మాట. గిఫ్ట్ తో పాటు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఒక నోట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ గిఫ్ట్ కన్నా శ్రీరామ్ ఆదిత్యకు ఎందుకు మహేష్ గిఫ్ట్ ఇచ్చాడన్న డిస్కషన్ ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతోంది. అసలు మహేష్ శ్రీరామ్ ఆదిత్య ఒక్కడికే ఆ గిఫ్ట్ ఇచ్చాడా లేక ఇండస్ట్రీలో ఉన్న అందరికీ ఇలా గిఫ్ట్స్ పంచాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇదే విషయమై మహేష్ ఫ్యాన్స్ శ్రీరామ్ ఆదిత్యను అడుగుతున్నారు.
మరోవైపు మహేష్ బాబు తన తర్వాతి సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఏమైనా చేయబోతున్నాడా, అందుకే ఇలా గిఫ్ట్ ఇచ్చాడా అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే శ్రీరామ్ ఆదిత్య వేటికీ రెస్పాండ్ అవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లకు కూడా గిఫ్ట్ ఇస్తే పర్లేదు కానీ ఒక్క శ్రీరామ్ ఆదిత్యకే గిఫ్ట్ ఇస్తే మాత్రం అది ఆలోచించాల్సిన విషయమే.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒక్క షెడ్యూల్ తప్పించి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ షెడ్యూల్ ను కూడా అవ్వగొట్టి నవంబర్ చివరినాటికి చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెల్సిందే. దీపావళి సందర్భంగా ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న విజయశాంతి లుక్ ను విడుదల చేసారు. అలాగే ఇప్పటివరకూ బయటపెట్టని రష్మిక లుక్ ను విడుదల చేసారు. మరో పోస్టర్ మహేష్ బాబు బైక్ పై కూర్చున్న స్టిల్ ను విడుదల చేసారు. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం మహేష్ తర్వాతి చిత్రమేది ఇంతవరకూ ప్రకటించలేదు. మరి అది శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలోనే ఉండనుందా? ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
That was a really sweet gesture @urstrulyMahesh garu !!Thank you for the lovely wishes !! Wishing You , Namratha garu , Gautham and Sitara a Fantastic and a Happy Diwali too
![]()
pic.twitter.com/cIb0Uyddh8
— Sriram adittya (@SriramAdittya) October 27, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31PIz99
Comments
Post a Comment