పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రూమర్స్ ఎన్ని వస్తున్నా అఫీషియల్ గా అయితే ఎలాంటి స్టేట్మెంట్స్ రావడం లేదు. కానీ పవన్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ పై డీప్ డిస్కర్షన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ రెడీ దర్శకుడిగా క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) అయితే సెట్టయ్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ అనంతరం క్రిష్ చేస్తున్న ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ దే అని టాక్ వస్తోంది.
ఇక విశ్వసనీయ మెగా వర్గాల సమాచారం ప్రకారం పవర్ స్టార్ న్యూ మూవీ పట్టాలెక్కడనికి ఎంతో సమయం లేదని తెలుస్తోంది. నవంబర్ 14వ తేదీన ఒక ముహూర్తం సెట్ చేశారట. అదే రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు అంచనాలకు తగ్గట్టుగా దర్శకుడు క్రిష్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే వీరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. కానీ అప్పుడు పవన్ బిజీగా ఉండడంతో కుదరలేదు.
ఇక ఎట్టకేలకు ఇప్పుడు కొత్త తరహా ప్రాజెక్ట్ తో మంచి సందేశం ఇచ్చేలా పవన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ని స్టార్ట్ చేసి ఫాస్ట్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారట. పవన్ చివరగా అజ్ఞాతవాసి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36rZ3bk
Comments
Post a Comment