Skip to main content

సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?

సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?
సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?

సుకుమార్, రత్నవేలుది డెడ్లి కాంబినేషన్. ఆర్య నుండి మొదలైన వీళ్ళ బంధం రంగస్థలం దాకా కొనసాగింది. సుక్కూ దర్శకత్వంలో రత్నవేలు కెమెరా వర్క్ తో దేవి శ్రీ ప్రసాద్ పాటలు.. ఇంతకంటే సూపర్ హిట్ కాంబినేషన్ ఉంటుందా అన్నట్లు సాగింది వీళ్ళ జోడి. అయితే ప్రస్తుతం లెక్క తారుమారైంది. సుకుమార్ సినిమాకు ఇన్నాళ్లూ పనిచేస్తూ వచ్చిన రత్నవేలు ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాకు పనిచేయట్లేదు. రత్నవేలు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, మరి ఎందుకు సుకుమార్ రత్నవేలును పక్కనపెట్టి విదేశీ సినిమాటోగ్రాఫర్ ను పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకని సుకుమార్ ఇలా చేసాడు? అంటే దానికి రీజనింగ్ లేకపోలేదు.

రత్నవేలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అతని క్యాలెండరు అసలు ఖాళీగా లేదు. సరిలేరు నీకెవ్వరు, ఇండియన్ 2 చిత్రాలతో రత్నవేలు చాలా బిజీగా ఉన్నాడు. కేవలం బిజీగా ఉన్న కారణంగానే రత్నవేలు సినిమా చేయట్లేదని అందుకు మించి ఏమి లేదని తెలుస్తోంది. అందుకే రత్నవేలు – సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ త్రయం ఈ సినిమా వరకూ విడిపోయింది. అల్లు అర్జున్ ఆరు నెలల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని చెప్పడంతో ఒక డెడికేటెడ్ కెమెరా మ్యాన్ ఉంటే బెటర్ అని, గ్యాంగ్ లీడర్ చిత్రానికి డిఓపిగా చేసిన కూబాను ఈ చిత్రానికి తీసుకున్నారు.

రత్నవేలు ఈ సినిమా టీమ్ ను మిస్సవుతున్నట్లు ట్వీట్ కూడా చేసాడు. డియర్ ఆర్య సుక్కూ ఈసారికి ఒకరినొకరు మిస్సవుతున్నాం. రంగస్థలం చిత్రంలానే ఇది కూడా కల్ట్ క్లాసిక్ అవ్వాలని కోరుకుంటున్నా, టీమ్ అంతటికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. మొత్తానికి ఈ ట్వీట్ వల్ల ఒక విషయం అయితే అర్ధమైంది. అల్లు అర్జున్ – సుకుమార్ కలిసి మరో కల్ట్ క్లాసిక్ ను అందించబోతున్నారు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంతకు మించిన ఆనందం వేరొకటి ఉంటుందా!



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JBy571

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...