Skip to main content

ఖైదీ మూవీ రివ్యూ

 ఖైదీ మూవీ రివ్యూ
ఖైదీ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తీ, నరేన్, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు, రాధామోహన్ (తెలుగు)
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

తెలుగులో మొదటినుండి మంచి పట్టున్న కార్తీ గత కొన్ని చిత్రాలుగా కథల ఎంపికలో చేసిన పొరబాట్లతో ఇక్కడ తన పట్టుని కోల్పోయాడు. మధ్యలో ఊపిరి, ఖాకీ వంటి మంచి సినిమాలు చేసినా కానీ ఆ తర్వాత వచ్చిన ప్లాపులతో మళ్ళీ కెరీర్ పరంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్, పాటలు, రొమాన్స్, కమర్షియల్ హంగులు వంటివేం లేకుండా కార్తీ చేసిన ప్రయత్నం ఖైదీ. నగరం అనే చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
ఢిల్లీ బాబు (కార్తీ) యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఒక ఖైదీ. అయితే పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత సత్ప్రవర్తన కారణంగా నాలుగేళ్ల శిక్ష కాలం తగ్గించి విడుదల చేస్తారు. కూతుర్ని చూడాలని తపించిపోతున్న ఢిల్లీకి పోలీసుల నుండి అనుకోని టాస్క్ వస్తుంది. వాళ్ళని అతను కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఢిల్లీ విజయవంతంగా పూర్తి చేయగలిగాడా? అసలు ఢిల్లీకే ఎందుకు ఆ పని అప్పజెప్తారు? అసలు ఆ పని ఏంటి? ఢిల్లీ గతమేంటి? ఈ ప్రయత్నంలో తన కూతుర్ని కలుసుగోగలిగాడా అన్నది మిగతా కథ.

నటీనటులు:
కార్తీ ఎంత మంచి నటుడన్నది మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కెరీర్ మొదట్లోనే విలక్షణమైన కథల్ని ఎన్నుకుని తాను అందరిలాంటి వాడిని కాదని చెప్పకనే చెప్పాడు కార్తీ. ఖైదీ చిత్రంలో కూడా కార్తీ తన పెర్ఫార్మన్స్ తో అలరించాడు. అది యాక్షన్ సీన్లయినా, ఎమోషనల్ సన్నివేశాలైనా కార్తీ ఇందులో రఫ్ఫాడించాడు. కూతుర్ని తలుచుకుని బాధపడే సీన్లలో కార్తీ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే క్లైమాక్స్ లో అతని నటన మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. నటుడిగా కార్తీ రేంజ్ ను మరోసారి చాటి చెప్పిన చిత్రంగా ఖైదీ నిలుస్తుంది.

పోలీస్ అధికారిగా నరేన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. కార్తీ వెంట ఉండే కుర్రాడు కూడా బాగా చేసాడు. మిగిలిన నటీనటులందరూ తమ పరిధి మేర రాణించారు.

సాంకేతిక నిపుణులు:
సాంకేతికంగా ఖైదీ ఉన్నతంగా నిలిచే చిత్రం. సామ్ సి.ఎస్ నేపధ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బలమైన సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి కొన్ని సన్నివేశాలు. యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుందో, ఎమోషనల్ సీన్స్ లోనూ అంతే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. కథ మొత్తం ఒక రాత్రే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం నైట్ షూట్. అయినా కానీ సినిమాటోగ్రాఫర్ ఎఫెక్టివ్ గా తెరకెక్కించాడు. ఏ ఫ్రేమ్ కూడా మోనాటోనీ కాకుండా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాత గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏ మాత్రం అనవసర కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం నిజంగా ఓ ప్రయోగమే. ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడానికి గట్స్ ఉండాలి. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ మొదటి సినిమాతోనే తన ప్రతిభ చాటుకున్నాడు. అయితే ఖైదీ మాత్రం తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం. భవిష్యత్తులో లోకేష్ ఎన్ని మంచి చిత్రాలు చేసినా ఖైదీ గురించి మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు.

చివరిగా:
ఎంత సిన్సియర్ గా కథ రాసుకున్నా, కమర్షియల్ హంగులు పెడితే రీచ్ ఎక్కువ ఉంటుందని ఎక్కడో అక్కడ కంప్రమైజ్ అయిపోయే దర్శకులున్నారు. నిజానికి ఇది వాళ్ళ తప్పు కూడా కాదు. అయితే లోకేష్ కనకరాజ్ మాత్రం తాను నమ్మిందే రాసుకున్నాడు. రాసుకున్నదే తీసాడు అనిపిస్తుంది ఖైదీ సినిమా చూస్తుంటే. కమర్షియల్ హంగులకు ఆస్కారం ఉన్నా కథకు కట్టుబడి తీసిన సినిమా ఖైదీ. సరిగ్గా నాలుగుగంటల్లో పూర్తయ్యే కథని రెండున్నర గంటల్లో చాలా ఎఫెక్టివ్ గా చూపించగలిగాడు లోకేష్. అటు యాక్షన్ సన్నివేశాలు, ఇటు ఎమోషనల్ సీన్లు ఇలా రెండూ బ్యాలెన్స్ అయ్యేలా స్క్రీన్ ప్లే కథకు కట్టుబడి రాసుకోవడం అంత సులువైన విషయం కాదు. నటీనటుల పెర్ఫార్మన్స్, సాంకేతిక నిపుణుల పనితీరు కలిసి ఖైదీ కార్తీ కెరీర్ లో స్పెషల్ చిత్రంగా నిలుస్తుంది.

అయితే కమర్షియల్ హంగులకు పెద్దగా ఆస్కారం లేని ఈ చిత్రాన్ని కమర్షియల్ చిత్రాలు చూడటానికి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు ఎంత వరకూ సమ్మతం తెలుపుతారన్నదే ఖైదీ విజయం మీద ఆధారపడి ఉంది.

ఖైదీ – మెప్పిస్తాడు

రేటింగ్ –3.25/5



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JiNvwP

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...