Skip to main content

ఆలస్యమవ్వడానికి కారణాలు చెప్పేసిన రామ్

Ram reveals reason behind red film announcement
Ram reveals reason behind red film announcement

ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరస ప్లాపుల నుండి బయటపడి అదిరిపోయే రీసౌండింగ్ హిట్ కొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎన్ని సార్లు మాస్ సినిమా చేద్దామని ప్రయత్నించినా పనవ్వని రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తో పూరి ఆ కలని నెరవేర్చాడు. ఇంత పెద్ద హిట్ కొట్టినా కానీ రామ్ తన తర్వాతి సినిమా ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నాడు. సాధారణంగా ఒక హిట్ పడ్డాక అదే జోష్ లో నెక్స్ట్ సినిమా ఏంటనేది ప్రకటించేసారు. అయితే రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ తర్వాత నాలుగు నెలలు అసలు చప్పుడు చేయలేదు.

రామ్ నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని ఎవరైనా అడిగినా మౌనమే వహించాడు. అయితే రామ్ నటించబోయే తర్వాతి సినిమాకి ఈరోజు ముహూర్తం జరిగింది. తమిళంలో హిట్ అయిన తడం సినిమాను రీమేక్ చేస్తున్నాడు రామ్. అయితే ఒరిజినల్ ను కొని తెలుగులో తీస్తున్న నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాత్రం ఈ చిత్రాన్ని రీమేక్ అనడానికి ఇష్టపడడం లేదు. కేవలం ఆ చిత్రంలోని సోల్ ను మాత్రమే తీసుకుంటున్నామని, తెలుగు వారి అభిరుచులకు తగ్గ మార్పులు బాగా జరిగాయని అన్నాడు.

మరి ఒక రీమేక్ ను ప్రకటించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అని రామ్ ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమే ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్ని రోజులకే తడం రీమేక్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడట. అయితే తన లుక్, టైటిల్, పోస్టర్ అన్నీ పక్కా అయ్యాకే సినిమా గురించి ప్రకటించాలని ఆగామని అంటున్నాడు రామ్. తడం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెల్సిందే. నవంబర్ 16 నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది.

అన్ని షెడ్యూల్స్ ముందే పక్కాగా వేసుకోవడంతో ముహూర్తం రోజునే విడుదల తేదీ కూడా ప్రకటించేసారు. సాధారణంగా తెలుగు సినిమాలకు షూటింగ్ పూర్తయితే కానీ రిలీజ్ డేట్ చెప్పే సాహసం చేయరు. కేవలం బాలీవుడ్ లోనే ముహూర్తం నాడు రిలీజ్ డేట్ ప్రకటించే సంస్కృతి ఉంటుంది. ప్రొడక్షన్ లోకి దిగాక అంతా పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతోనే నాలుగు నెలల విరామం తీసుకున్నట్లు రామ్ చెప్తున్నాడు. చూస్తుంటే ఇదే బెస్ట్ అనిపిస్తోంది కదా. సరిగ్గా ప్లానింగ్ లేకుండా ప్రొడక్షన్ లోకి దిగిపోయి తర్వాత షెడ్యూల్స్ తారుమారై నటుల డేట్స్ దొరక్క నానా ఇబ్బందులూ పడాలి.

అన్నట్లు ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న సంగతి తెల్సిందే. రామ్ తో ఇంతకుముందు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలను తెరకెక్కించాడు కిషోర్ తిరుమల. మూడో చిత్రం కూడా తాను రాసుకున్న కథ పట్టుకెళ్ళగా, రామ్ తడం రీమేక్ బాధ్యతలను తన మీద పెట్టాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అయిపోయిన రామ్, రెడ్ కు కూడా సంగీతం అందించాలని కోరాడు. అయితే ఈ చిత్ర హీరోయిన్ విషయంలో ఇంకా గోప్యత పాటిస్తున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nul40e

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...