Skip to main content

ప్రభాస్ 20.. ఇప్పుడంతా సెట్ అయినట్టేనా?

ప్రభాస్ 20.. ఇప్పుడంతా సెట్ అయినట్టేనా?
ప్రభాస్ 20.. ఇప్పుడంతా సెట్ అయినట్టేనా?

ఒక సినిమా సక్సెస్ కాగానే దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో నేల విడిచి సాము చేయడం అనేది అంత మంచి పద్దతి కాదు. కథకు తగ్గట్లుగానే ఏ సినిమాకైనా ఖర్చు ఉండాలి. మనకి క్రేజ్ ఉంది, బిజినెస్ ఈజీగా అయిపోతుంది కదాని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ వెళిపోతే రిజల్ట్ సాహో తరహాలో ఉంటుంది. ప్రభాస్ కు బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో విపరీతమైన గుర్తింపు వచ్చింది. నార్త్ లో ప్రభాస్ ను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. అంతే సాహోకు బడ్జెట్ పెరిగిపోయింది. మొదట 50 కోట్లలో తీద్దామనుకున్న సాహో బాహుబలి సక్సెస్ తో బడ్జెట్ 300 కోట్లకు చేరుకుంది. అనవసర హంగులు బోలెడు జోడించారు. కథను ట్విస్ట్ చేసి చెప్పడం వల్ల క్లారిటీ లోపించింది. భారీ రేంజ్ లో ఖర్చు పెట్టేయడంతో సాహో బడ్జెట్ పరిమితులు దాటిపోయింది. ఫలితంగా బాహుబలి క్రేజ్ ను సరిగ్గా వినియోగించుకోవడంలో సాహో ఫెయిల్ అయింది. ఈ చిత్రం ఒక్క నార్త్ లో తప్పితే మిగిలిన అన్ని చోట్లా దారుణంగా విఫలమైంది. తెలుగు వారు సాహోను పూర్తిగా తిప్పికొట్టారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ 20వ చిత్రం విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. ప్రభాస్ నటిస్తోన్న 20వ చిత్రానికి జాన్ అనే టైటిల్ ను అనుకుంటున్న విషయం తెల్సిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటివరకూ యూరోప్ లో 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. దాని తర్వాత సాహో పనుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోవడంతో ఆరు నెలలకు పైగా బ్రేక్ పడింది. సాహో ఫలితంతో అప్రమత్తమైన జాన్ మేకర్స్.. ఈ చిత్ర స్క్రిప్ట్ ను మళ్ళీ సమీక్షించారు. అనవసర హంగుల జోడించకూడదని నిర్ణయించుకున్నారు. బడ్జెట్ కూడా కుదించుకుందామని ఫిక్స్ అయ్యారు. దీని ప్రకారం ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా మారిపోయింది. స్క్రిప్ట్, మూవీ మేకింగ్ విషయంలో మార్పులు, కరెక్షన్స్ అన్నీ జరిగాయని భావించిన తర్వాత కొత్తగా షెడ్యూల్స్ వేసుకుని నవంబర్ నుండి మళ్లీ షూటింగ్ కు వెళ్లనున్నారు. విరామం తర్వాత తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఇప్పటికే నిర్మించిన భారీ సెట్ లో జాన్ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాలుపంచుకుంటారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కూడా మూడు భాషల్లో విడుదలవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. గోపికృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట భావించారు. అయితే ఇప్పడున్న పరిస్థితుల్లో అది జరగని పనిగా తెలుస్తోంది. వచ్చే దసరాకి విడుదల కావొచ్చని అంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qIsgOD

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...