Skip to main content

పవన్ జానపద చిత్రం.. కన్ఫర్మ్ అయినట్టేనా?

పవన్ జానపద చిత్రం.. కన్ఫర్మ్ అయినట్టేనా?
పవన్ జానపద చిత్రం.. కన్ఫర్మ్ అయినట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. మొదట్లో చేయనని తన ఫోకస్ మొత్తం రాజకీయాల మీదే ఉందని కొంచెం బెట్టు చేసినా, నిర్మాతల ఒత్తిడికి పవన్ కళ్యాణ్ తలొగ్గక తప్పలేదు. రీ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ చేసాడు కానీ ఎవరితో చేస్తున్నాడు, ఏ రకమైన సినిమా చేస్తున్నాడన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. కొన్ని రోజుల క్రితం ఒక అప్డేట్ వచ్చింది. దిల్ రాజు పవన్ రీ ఎంట్రీకి ఒప్పించాడని, పెద్ద కష్టం లేకుండా చేయడానికి, డ్యాన్సులు, ఫైట్లు లేకుండా ఉండేలా పింక్ రీమేక్ ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి మహా అయితే 25 రోజుల కాల్ షీట్స్ అవసరమవుతాయని, అటు రాజకీయాలను కూడా బ్యాలన్స్ చేస్తూనే హ్యాపీగా ఈ సినిమా చేసుకోవచ్చని దిల్ రాజు ప్రపోజల్ పెట్టాడట. అయితే ఈ విషయమ్మీద చూద్దాం అన్నట్టుగానే పవన్ స్పందించినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మరో కొత్త వార్త బయటకు వచ్చింది. పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం నిజమే కానీ అది దిల్ రాజు ప్రపోజ్ చేసిన పింక్ రీమేక్ తో కాదని, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వంలో సినిమాతో పవన్ తన రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఈ సినిమా కూడా ఆషామాషీగా ఉండదని, భారీ బడ్జెట్ లో జానపద జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక క్రిష్ పవన్ కు ఫుల్ నరేషన్ ఇస్తాడట. అది కనుక ఓకే అయితే ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసినట్లే. ఇప్పటివరకూ పవన్ జానపద జోనర్ ను టచ్ చేయలేదు. కాబట్టి ఇది చాలా సరికొత్త ప్రయత్నమని చెప్పాలి. అందులో ఈ కథ 100 ఏళ్ల క్రితం జరిగిన కథగా ఉంటుందిట. అంటే పీరియాడిక్ జానపద చిత్రమన్నమాట. మరి పవన్ కు ఇలాంటి ప్రాజెక్ట్ సెట్ అవుతుందా? అందులోనూ రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు డిఫరెంట్ గా ఉంటాయి.

మరి క్రిష్ ఎలాంటి కథను పవన్ కోసం సెట్ చేస్తున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు. అన్నీ సజావుగా సాగితే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మొదట్లోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే పవన్ సులువుగా అయిపోయే పింక్ రీమేక్ ను కాదని క్రిష్ సబ్జెక్ట్ పై ఎందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడన్నది అర్ధం కాని ప్రశ్న. అంటే క్రిష్ ఫస్ట్ నరేషన్ తో పవన్ ను ఇంప్రెస్ చేశాడా? ఏమో వారిద్దరికే తెలియాలి. పవన్ ఆఖరి చిత్రం అజ్ఞాతవాసి దారుణమైన పరాజయాన్ని పొందిన విషయం తెల్సిందే. మరోవైపు క్రిష్ కూడా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకోగా, హిందీలో మణికర్ణిక విజయం సాధించినా దాని చుట్టూ ముసిరిన వివాదంతో క్రిష్ పేరు మసకబారిందనే చెప్పాలి. మరి ఈ ఇద్దరూ కలిసి చేయబోయే చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NjGRHZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...