Skip to main content

తెలుగులో ‘లస్ట్ స్టోరీస్’ చేస్తున్నారు దానికి దర్శకులు నలుగురు

తెలుగులో 'లస్ట్ స్టోరీస్' చేస్తున్నారు దానికి దర్శకులు నలుగురు
తెలుగులో ‘లస్ట్ స్టోరీస్’ చేస్తున్నారు దానికి దర్శకులు నలుగురు

మన తెలుగు సినిమాలకి, హిందీ సినిమాలకి దృఢమైన ఒక గట్టి పోటీ ఉంటుంది. నువ్వా -నేనా అన్నట్టు సాగుతుంది పోటీ, మన సినిమాల కథల విషయంలో, థియేటర్ లోకి  వచ్చే సినిమాల విషయంలో గెలిచి మన తెలుగు సినిమాలు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నప్పటికీ…. డిజిటల్ మీడియా అనగా వెబ్ సిరీస్ ల పరంగా చూసుకుంటే వారు ఎక్కడో పైన ఉంటే మనం ఇంకా కిందనే ఉండిపోతున్నాము. కారణం మన తెలుగు వెబ్ సిరీస్ లకి ఆదరణ తగ్గుతున్నాయి. బాలీవుడ్ లో నెలకి సంబంధించి చాలా వెబ్ సిరీస్ లు విడుదల  అవుతున్నాయి అవి బాగా ఆదరణ పొందుతున్నాయి.

అలా బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఇప్పటి వరకు ‘గాంది బాత్ 3’, ‘ఘోస్ట్’, ‘లస్ట్ స్టోరీస్’ బాగా ఆదరణ పొందాయి. ఇప్పుడు ఆ మూడింటిలో లస్ట్ స్టోరీస్ ని మన తెలుగు వారి నేటివిటీ కి తగ్గట్టుగా అందించాలని నిర్మాత ‘రోని స్క్రూవాలా’ నిర్ణయించుకున్నారు. లస్ట్ స్టోరీస్ కథ విషయానికి వస్తే నలుగురు జంటల మధ్య వారి ప్రయాణానికి సంబంధించింది. మరి ఆ నాలుగు జంటలని ఒక్క దర్శకుడు కాకుండా నలుగురు దర్శకులు కలిసి నాలుగు భాగాలుగా డైరెక్ట్ చేపించాలని ‘నందిని రెడ్డి’, ‘సందీప్ రెడ్డి వంగా’, ‘సంకల్ప్ రెడ్డి’, ‘తరుణ్ భాస్కర్’ వంటి యువ దిగ్గజాలని రంగం లోకి దింపారు నిర్మాత ‘రోని స్క్రూవాలా’ గారు.

ఇక మొదటి భాగం విషయానికి వస్తే అందులో నటించే జంటలకి సంబందించిన షూటింగ్ ని నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేసారు. ఇందులో అమ‌లాపాల్‌ – జగపతి బాబు గారు కలిసి ఒక జంటగా నటించారు.  అమ‌లాపాల్‌ కేవలం 10 రోజుల్లోనే తనకి సంబందించిన షూటింగ్ జరిపించుకోవటం చూస్తుంటే నందిని రెడ్డి గారిని పూర్తిగా నమ్మడం, డైరెక్టర్ గారు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోవడం వల్లనే సాధ్యం అయింది. పూర్తిగా విభిన్నమైన కలయిక అయిన జగపతి బాబు –  అమ‌లాపాల్‌ ని నందిని రెడ్డి గారు ఎలా డైరెక్ట్ చేసారో? వారి ఎమోష‌న్స్ ని ఎలా చూపిస్తారో? అని ఒక్కసారిగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రజలందరు ఆలోచించుకునేలా చేసారు.

మరి తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి మిగిలిన ముగ్గురు డైరెక్ట్ చేయబోయే మూడు భాగాల్లో నటి నటుల పరంగా ఎవరిని తీసుకుంటారో? మొదటి భాగం మొదట విడుదల చేస్తారా? లేక అన్ని భాగాలు షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకొక్కటిగా విడుదల చేస్తారా? అనే జనాల ప్రశ్నలకి నిర్మాతలు, దర్శకులు మాత్రమే సమాధానం చెప్పాలి. మొత్తానికి నిర్మాత రోని స్క్రూవాలా గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అయిన మన తెలుగు వెబ్ సిరీస్ ల మీద జనాలకి ఆసక్తి పెరుగుతుంది. తెలుగులో ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించడానికి పలువురు నిర్మాతలు ముందుకు వస్తారు. అలా అయిన మన తెలుగు వెబ్ సిరీస్ లు బాగా ఆదరణ పొంది హిందీ వారికి పోటీగా వెళ్లిపోవచ్చు.


from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31Of87L

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...