Skip to main content

బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?

బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?
బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?

బిగ్ బాస్ లో నాగార్జున ఎవరినైనా ప్రశ్నించాడా అంటే అది బాబా భాస్కర్ ను మాత్రమే. ఎవరిదైనా తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశాడా అంటే అది బాబా భాస్కర్ నే. ఈ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ చూస్తే అసలు ఎపిసోడ్స్ చూడట్లేదనే విషయం అర్ధమైపోతుంది. మరి హోస్టింగ్ చేసేటప్పుడు మైక్రో ఫోన్ లో నాగార్జునకు సూచనలు ఇచ్చేది ఎవరో, హోస్టింగ్ కు ముందు నాగార్జునకు బ్రీఫింగ్ ఇచ్చేది ఎవరో కానీ వారికి బాబా భాస్కర్ అంటే ఇష్టం లేదనుకుంటా. అందుకే ఐదవ వారం నుండి అనుకుంట బాబా భాస్కర్ ను ఎలాగైనా టార్గెట్ చేయాలని చూసారు. బాబా భాస్కర్ కు బాబా మాస్కర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. బాబా భాస్కర్ కామెడీ చేస్తుంటే ప్రతిసారి కామెడీ ఏంటని అన్నారు. అదే డల్ గా ఉండిపోతే ఇలా ఉండిపోతే కష్టం అన్నారు. ఇలా ప్రతిసారి బాబా భాస్కర్ ను వీలైనంత బ్యాడ్ చేయాలని చూసారు. కానీ బాబా మాత్రం అంత త్వరగా లొంగలేదు. పరిస్థితులకు ఎదురువెళ్ళాడు. భాష సమస్యను అధిగమించాడు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. నిజానికి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు కొన్ని భాష సమస్య వల్ల బాబా భాస్కర్ కు అర్ధమయ్యేది కాదు. ఎందుకంటే శ్రీముఖి, శివజ్యోతి లా బాబా భాస్కర్ వరసగా అన్ని భాషల్లో అన్ని బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసి ప్రిపేర్ అయ్యి రాలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే, పోదున్నే లేవడం, నవ్వుతూ ఉండడం, అందరికీ వండి పెట్టడం, టాస్క్ లలో ఇరగదీయడం. నిజానికి బాబా భాస్కర్ ఇంత బాగా టాస్క్ ఆడతాడని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఊహించలేదు. అందుకే శ్రీముఖి, అలీతో టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఇచ్చినప్పుడు ఫిజికల్ టాస్క్ లు ఇచ్చాడు. కానీ శ్రీముఖిపై బాబా గెలవగా, అలీ చేసిన తప్పు వల్ల టాస్క్ రద్దయింది. అక్కడ కూడా బాబా భాస్కర్ లాస్ట్ వరకూ అలీకి టఫ్ ఫైట్ ఇచ్చాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకోలేకపోయినా అభిమానుల సపోర్ట్ తో బాబా భాస్కర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు.

ఎంత ఆపుదామని ప్రయత్నించినా బాబా భాస్కర్ ఫైనల్స్ కు రావడంతో బిగ్ బాస్ తన స్ట్రాటజీని మార్చేశాడు. ఇప్పుడు తనకి ఎలివేషన్స్ ఇస్తున్నాడు. నిన్న, ఈరోజు ఎపిసోడ్ లో ఫైనల్స్ కు చేరిన హౌజ్ మేట్స్ కు చెందిన జర్నీని చూపించగా అందులో బాబా భాస్కర్ జర్నీ హైలైట్ గా నిలిచింది. తన ఏవీ కట్ చేసినన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంక ఎవరి వీడియోకు కూడా వాడలేదు. బాబా భాస్కర్ ను సూపర్ స్టార్ అని సంబోధించడం దగ్గరనుండి బాబా భాస్కర్ జర్నీ ది బెస్ట్ అనేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రాజెక్ట్ చేసారు. హౌజ్ లో పెద్దగా ఎమోషనల్ అవ్వని బాబా భాస్కర్ కూడా ఆ ఏవీ చూసి చాలా సేపు ఎమోషనల్ అయిపోయాడు. మిగతా ఎవరితో కూడా ఎక్కువసేపు మాట్లాడని బిగ్ బాస్, బాబా భాస్కర్ తో మాత్రం చాలా సేపు కబుర్లు చెప్పాడు. హౌజ్ లో అందరూ ఎమోషనల్ అయినా కూడా బాబా భాస్కర్ నే కారణమడిగి తెలుసుకున్నారు. నిన్న ఎపిసోడ్ లో రాహుల్, వరుణ్, బాబా భాస్కర్ జర్నీ చూపించేయగా.. ఈరోజు ఎపిసోడ్ లో శ్రీముఖి, అలీ జర్నీ చూపించారు. వీళిద్దరిదీ అయితే మరీ ఫ్లాట్ గా కట్ చేసారు.

చూస్తుంటే బిగ్ బాస్ ఇక రెండు రోజులే ఉండడంతో ఓటర్లను ప్రభావితం చేయడానికి చూస్తున్నాడనిపిస్తోంది. అన్నట్టు బిగ్ బాస్ 2 షో విన్నర్ కౌశల్ ఫైనల్స్ కు చేరిన ఐదుగురిలో ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోవడానికి ఒక ప్లాన్ చెప్పాడు. ఆట, మాట, బాట అంటూ మూడు కాలమ్స్ గీసుకుని ప్రతి కంటెస్టెంట్ ఆట ఎలా ఆడాడు, ఎంత వరకూ ఎఫర్ట్ పెట్టాడు, మాటతీరు ఎలా ఉంది, ఫైనల్స్ కు వెళ్ళడానికి వేసుకున్న బాటలో ఎంత నిజాయితీ ఉంది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటు వేయమని చెప్పాడు. ఈ వీడియో కింద కామెంట్స్ ను పరిశీలిస్తే అందరూ రాహుల్ కు ఒక్క క్వాలిటీ కూడా లేదనడం విశేషం. ఎక్కువ మంది శ్రీముఖి, బాబా భాస్కర్ లలో ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. మరి నిజంగానే వీరిద్దరూ టాప్ 2 చేరుకుంటారా?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nvq0SD

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...