Skip to main content

చిన్మయి కంటే ఒక మెట్టు ఎక్కిన మెగా కోడలు

చిన్మయి కంటే ఒక మెట్టు ఎక్కిన మెగా కోడలు
చిన్మయి కంటే ఒక మెట్టు ఎక్కిన మెగా కోడలు

మాధ్యమాల్లో లేక సినిమాలలో ఆడవారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే ‘చిన్మయి శ్రీపాద’ ట్విట్టర్ నుండి ఒక ట్వీట్ వచ్చేస్తుంది క్షణాల్లో. అందుకే ఆమెని ‘ఫెమినిస్ట్’ అంటారు. ఏదైనా సంఘటన గురించి చిన్మయి ప్రశ్నిస్తే కొంతమంది ఆమెకి మద్దతు తెలిపితే ఎక్కువ మంది ఆమెను వ్యతేరేకిస్తారు. అందుకే ఆమె బ్లాక్ లిస్ట్ పెద్దది. ట్విట్టర్ లో ఎవరన్నా ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఆమె ట్వీట్ కి రిప్లై ఇస్తే వారి పేరు బ్లాక్ లిస్ట్ లోకి చేరిపోతుంది.

ఒకవేళ ఇంకొక సంఘటన ఏదైనా తీసుకోండి అది మన సినిమా ప్రముఖులకు కానీ మన అనుకునే తెలుగు సినిమాకి గౌరవం తగ్గితే చిన్మయి ట్వీట్ చేసిందో లేదో కానీ అసలు ఆమెకి సంబంధం ఉన్నా లేకున్నా ఒక ట్వీట్ అయితే పెట్టాల్సింది కదా. సరే ఇక చిన్మయి విషయం వదిలేస్తే మనకి ఇక్కడ మాట్లాడుకోవడానికి మనకి జరిగిన అవమానం గురించి మెగా కోడలు ‘రామ్ చరణ్‘ భార్య అయిన ‘ఉపాసన కొణిదెల’ గారు మన తెలుగు సినిమా ప్రముఖుల గురించి తెలుగు సినిమా వైభవాల గురించి మన ప్రధాని మోడీ గారితో ఏ మాత్రం వణుకు లేకుండా తన అభిప్రాయాన్ని అడిగి కడిగేసింది.

మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాత్మ గాంధీ గారి 150 వ జన్మదిన కార్యక్రమాలని తన ఇంట్లో అట్టహాసంగా జరిపించారు. ఇందులో భారతీయ చిత్ర ప్రముఖులకు ప్రత్యేక విందు భోజనాన్ని ఏర్పాటు చేసారు. ఈ విందుకి మన దక్షిణాది సినిమా ప్రముఖులకు ఎవ్వరికీ ఆహ్వానం రాలేదు. అదే బాలీవుడ్ నుండి చిన్న పాటి నటి నటులకి కూడా ఆహ్వానం అందింది. మన తెలుగు సినిమా వారి ద్వారా ‘దిల్ రాజు’ గారికి ఇంకా ఇద్దరికీ ఆహ్వానం అందింది. దిల్ రాజు గారు కూడా మన వారు ఎవ్వరు రాలేదని తెలుసుకొని అక్కడ ఎక్కువ సమయం కేటాయించకుండా వెంటనే తిరిగి వచ్చేసారు. దిల్ రాజు గారికి అక్కడికి వెళ్ళేదాకా ఏమి తెలియదు. అక్కడికి వెళ్లిన తర్వాత మన వారు ఎవరు లేకపోవడంతో మొకం చాటేసుకొని ఒక ఫోటో దిగి వచ్చేసారు.

ఇక నరేద్ర మోడీ గారితో బాలీవుడ్ ప్రముఖులు ఫోటోలు దిగి పలు మాధ్యమాల్లో పెట్టేసరికి అందరూ చూసారు కానీ ఎవ్వరు మా తెలుగు సినిమా వారిని పిలవలేదు అని కారణం అడగలేదు. ఇక ఓపిక నశించిన ఉపాసన కొణిదెల గారు తన ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో నరేంద్ర మోడీ గారిని టాగ్ చేస్తూ “ప్రముఖులు పెద్దలు అయిన నరేద్ర మోడీ గారికి నమస్కరిస్తూ…. ద‌క్షిణాది ప్రజలందరికి మీరంటే ఎంతో గౌర‌వం మీ పై గౌరవం, ప్రేమ అందరికి ఎక్కువే. ప్రధానిగా మీరు మన భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకి ఎగరవెయ్యడం  ప‌ట్ల మేం గ‌ర్విస్తున్నాం. మీరు గొప్ప వ్యక్తుల‌ను వారి జన్మదిన కార్యక్రమాల‌కు కేవ‌లం హిందీ న‌టీన‌టులకు మాత్రమే ఆహ్వానం పంపి ప‌రిమితం చేశారు మిగిలిన సినీప్రముఖులు ఆహ్వానం పంపలేదు. ద‌క్షిణాది న‌టీన‌టుల‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం మీద చాలా బాధ‌తో దక్షిణాది వారికి జరిగిన అవమానాన్ని చూడలేక నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను” అని ట్వీట్ చేసారు.

ఉపాసన ట్వీట్ కి ఇప్పుడు మాధ్యమాల్లో బాగా ఆదరణ లభిస్తుంది. ఒకపక్క కొంతమంది అయితే చిన్మయి శ్రీపాద కంటే మెగా కోడలు ఇలా అడగటం వలన ఆమె స్థానం నంబర్ 1  కి చేరిపోయింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫెమినిస్ట్ అని ఒక పేరు పెట్టేసుకొని అనవసరమైన విషయాలని జనాల మీద రుద్దడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31v83Zn

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...