Skip to main content

కొత్త దర్శకులకి పాత దర్శకులు, నిర్మాతలు చెయ్యి అందిస్తున్నారు

కొత్త దర్శకులకి పాత దర్శకులు, నిర్మాతలు చెయ్యి అందిస్తున్నారు
కొత్త దర్శకులకి పాత దర్శకులు, నిర్మాతలు చెయ్యి అందిస్తున్నారు

సినిమా తరం మారుతుంది. కొత్త కొత్త కథలు, నిర్మాతలు, కథా నాయకులు, నాయికలు, హాస్య కథానాయకులు, సంగీత దశ్శకులు ఇలా 24 చేతి పనులు ఉన్న సినిమా పరిశ్రమ లోకి అడుగుపెడుతున్నారు. మరి అందులో మొదటి ప్రయత్నానికి మంచి సక్సెస్ వచ్చి సంబరపడి హడావిడిగా కెరీర్ ని నాశనము చేసుకున్న వారు ఉన్నారు. ఎన్ని విజయాలు వచ్చిన వారి పని వారు చేసుకున్న వారు కూడా ఉన్నారు.

మరి పాత దర్శకులు, నిర్మాతలు అలా హడావిడిగా కెరీర్ ని నాశనం చేసుకున్న వారికంటే, ప్రతిభ ఉండి ఎన్ని విజయాలు వచ్చిన తమ పని తాము చేసుకుంటున్న వారికి మద్దతు ఇస్తున్నారు. వారి భవిష్యత్తు ప్రణాళికలకు సహాయం చేస్తున్నారు. మొదటి సినిమాగా విడుదల అయిన ‘మెంటల్ మదిలో’ దర్శకులు ‘వివేక్ ఆత్రేయ’ కి ఇప్పుడు మాటల మాంత్రికులు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ అలాగే నిర్మాత ‘దిల్ రాజు’ తోడయ్యారు.

మెంటల్ మదిలో సినిమా యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా అన్ని రకాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలకి అందరూ ఫిదా అయిపోయారు. అందువలన వివేక్ ఆత్రేయ కి రెండు నిర్మాణ సంస్థలు మూడవ సినిమా నుండి చేయబోయే ప్రతి సినిమాలకి తోడు ఉండాలి అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దిల్ రాజు గారు మన వాడికి సహాయం చెయ్యాలని దిగి వచ్చారు.

ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘శ్రీ వెంకటేశ్వర క్రీయేషన్స్’ వారు వివేక్ ఆత్రేయ ప్రతిభకి మంచి అవకాశం ఇచ్చారు. బ్రోచేవారివురురా సినిమా తరువాత సమయం తీసుకున్న వివేక్ ఇక నుండి వరుసగా సినిమాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. తన మూడవ సినిమాకి త్రివిక్రమ్ గారు కూడా దగ్గరుండి పర్సనల్ గా ఆ ప్రాజెక్ట్ లో ఉండాలనుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దిల్ రాజు గారి మద్దతు లభిస్తుండటం మన వాడికి ఇంకొక బూస్ట్ అప్ అని చెప్పవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BaQ3bV

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...