Skip to main content

మాస్ హీరోల పంతం ఎప్పటికి తగ్గుతుందో?

మాస్ హీరోల పంతం ఎప్పటికి తగ్గుతుందో?
మాస్ హీరోల పంతం ఎప్పటికి తగ్గుతుందో?

టాలీవుడ్ లో ఇద్దరు హీరోలకి ఇదివరకే ఒక హీరోయిన్ విషయంలో బాగా గొడవలు అయ్యాలి అని రూమర్లు వచ్చాయి. అది ఎంతవరకు నిజమో? అందులో అంత జరిగిందా? అనే దానికి ఎవ్వరి దగ్గర 1% సమాధానం కూడా లేదు. అంటే కావాలని ప్రచారం చేసారా? అంటే అందులో కూడా 1% నమ్మకం లేదు. ఆ ఇద్దరు హీరోలు ఒకలు మాస్ మహారాజ్ ‘రవితేజ’ గారు, ఇంకొకలు నట సింహం నందమూరి ‘బాలకృష్ణ’ గారు.

బాలయ్య గారి గురించి రవితేజ గారు ఒక హీరోయిన్ దగ్గర అతిగా మాట్లాడటం వలన బాలయ్య గారు రవితేజ గారిని పిలిపించి మందలించారు అని ప్రచారం జరిగింది. ఆ హీరోయిన్ అయిన ‘మీరా జాస్మిన్’ గారిని కూడా ఇలా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినందుకు అభిమానులకి నచ్చలేదు. అందుకే రవితేజ సినిమాకి బాలకృష్ణ గారి సినిమాలు ఎమన్న పోటీకి దిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగేది. గొడవ ఎప్పుడో జరిగినా దానిని ఇంకా మర్చిపోలేని వాళ్ళు కూడా ఉన్నారు. రవితేజ గారి సినిమాలు బాలకృష్ణ సినిమాకి పోటీగా విడుదల అయ్యి ఎక్కువగా విజయం పొందాయి.

2008 సంక్రాంతికి బాలకృష్ణ ‘ఒక్క మొగాడు’ సినిమాకి పోటీగా రవితేజ ‘కృష్ణ’ సినిమా విడుదల అయ్యింది రెండింటిలో రవితేజ గారి ‘కృష్ణ’ సినిమా బాగా విజయవంతం అయ్యింది. 2011 సంక్రాంతికి బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ విడుదల అయితే రవితేజ గారి ‘మిరపకాయ్’ సినిమా విడుదల అయ్యింది. ఇంకేముంది మళ్ళీ రవితేజ గారికి విజయం దక్కింది. 2012 సమ్మర్ సీజన్లో కొంచెం సీన్ రివర్స్ అయ్యింది. రవితేజ గారి ‘దరువు’ అలాగే బాలకృష్ణ గారి ‘అధినాయకుడు’ సినిమాలు పోత పోటీగా విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ సినిమా యూనిట్ వాళ్ళు మళ్ళీ గొడవలు పెంచడం ఇష్టం లేక దరువు సినిమా వచ్చిన ఒక వారం తర్వాత అధినాయకుడు విడుదల అయ్యింది.

దరువు సినిమా అలాగే అధినాయకుడు సినిమాలు రెండు వారి కెరీర్ లో పెద్ద డిసాస్టర్ అయ్యాయి. దరువు సినిమా అధినాయకుడు కంటే మళ్ళీ కొంచెం ఎక్కువ ఓట్లు సంపాదించుకుంది. చూసుకుంటే రవితేజ గారు బాలకృష్ణ గారికి సినిమాల పరంగా గట్టి పోటీ అని తేలిపోయింది. అయితే రాబోవు సినిమాలు అనగా రవితేజ గారి ‘డిస్కోరాజా’ మరియు బాలకృష్ణ- కే.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఇంకా పేరు లేని (పరిశీనలలో ఉన్న పేరు ‘రూలర్’) సినిమాని ఒకేసారి పోటీగా 2019 క్రిస్టమస్ కి విడుదల చేయాలి అని అనుకుంటున్నారు.

అయితే రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటడం వలన సినిమా ఏకంగా ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ అయ్యిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా కూడా క్రిస్టమస్ కి విడుదల అవ్వాలి కానీ ఆ సినిమా కూడా వాయిదా పడింది. అయితే బాలకృష్ణ గారి సినిమాకి పోటీగా సాయి ధరమ్ తేజ్ ‘ప్రతి రోజు పండగ’ సినిమా విడుదల అవుతుంది. ఇంతకీ మరి బాలకృష్ణ గారి సినిమా కచ్చితంగా క్రిస్టమస్ కి విడుదల అవుతుందా? అంటే అందులో కొంచెం కూడా సందేహం లేకుండా ఎక్కువ మంది కష్టమే అంటున్నారు. కారణం సినిమా యూనిట్ వాళ్ళు సినిమా గురించి ఒక్క ప్రచారం కూడా బయటికి రానివట్లేదు.

ఈ రోజు సాయంత్రం 7:00 గంటల సమయంలో రవితేజ గారు నటిస్తున్న డిస్కో రాజా సినిమా నుండి మొదటి పాట ‘నువ్వు నాతో ఏమన్నవో’ ని విడుదల చేయబోతున్నారు. విశ్వసనీయ సమాచారాల ప్రకారం ఆ పాటని ‘ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం’ గారు పాడారు అంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pB7wYw

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...