Skip to main content

‘బుక్ మై షో’ నువ్వు అంత తోపు ఆ? సినిమా గురించి నీకెందుకు?

‘బుక్ మై షో’ నువ్వు అంత తోపు ఆ? సినిమా గురించి నీకెందుకు?
‘బుక్ మై షో’ నువ్వు అంత తోపు ఆ? సినిమా గురించి నీకెందుకు?

ఒకప్పుడు సినిమా కి వెళ్ళాలి అంటే ఒక 1 గంట ముందో? లేక ఒక పుట ముందో? లేదంటే ఒక రోజు ముందో? వెళ్ళి థియేటర్ దగ్గర పడిగాపులు కాచేవారు సినిమాకి టిక్కెట్ దొరకాలి మొదటి రోజు మొదటి ఆట చూడాలి అని పిచ్చి జనం అలా చేసేవారు. అందులో సగం మంది పక్కన ఉండే పల్లెటూరు వారు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు పని అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చి సినిమా చూసి, ఆ సినిమా గురించి వారి ఊరంతా చెప్పేవాళ్ళు అప్పట్లో.

మరి ఇప్పుడు 2020 యుగం వచ్చింది, ఇప్పుడు థియేటర్ ముందు టిక్కెట్ కోసం పడికాపులు కాచేవాళ్ళు ఉండరు. ఎందుకంటే పల్లెటూరి వారికి కూడా తెలిసిపోయింది ఆన్లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకోవడం. ఆ ఆన్లైన్ ప్రక్రియ పేరు ‘బుక్ మై షో’. మరి ఆ బుక్ మై షో వారు ఊరికే అంతా పేరు సంపాదించుకోలేరు. ఏదో ఒక దానితో జనాలకి దగ్గర అవ్వాలి అని చెప్పి ఆ సినిమాకి ఇంత మంది జనం బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకి జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పి ఒక దిక్కుమాలిన % పెట్టేస్తున్నారు. ఇప్పుడు ‘సైరా’ సినిమాకి జనం ఆసక్తి చూపిస్తారు. కాబట్టి దానికి 80-90% వరకు ఇచ్చిన చూసేస్తారు, టిక్కెట్లు బుక్ చేసేసుకుంటారు.

సైరా అంటే పెద్ద సినిమా అందులో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాకి తక్కువ % ఇస్తే జనాలు బుక్ మై షో ని తిట్టుకుంటారు కాబట్టి ఎక్కువగానే ఇవ్వాలి. అది వారి మార్కెటింగ్ స్ట్రాటజీ లో ఒకటి. మరి చిన్న సినిమాలు బాగా ఆధారణ పొందుతున్నాయి అని ఆ సినిమా విడుదల అయిన రోజు ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ సినిమా బాలేదు అని చెప్పితే అందరూ వారి మాటను నమ్ముతారు. కారణం చిన్న సినిమా కాబట్టి డబ్బులు వృధా చేసుకోవడం జనాలకి ఇష్టం ఉండదు. ఒక చిన్న సినిమాకి ఆధారణ మొదటి రోజు నుండి తెలియదు. మెల్ల మెల్లగా ఆ సినిమా కోసం జనాలు వెళ్లాలా? వద్దా? అనేది కూడా ఇప్పుడు బుక్ మీ షో డిసైడ్ చేసేస్తుంది. కారణం బుక్ మై షో ఇస్తున్న % కి చిన్న సినిమాలకు వస్తున్న ఆధారణ వలన తెలుగు పరిశ్రమకి ఇబ్బంది వస్తుంది.

గత శుక్రవారం విడుదల అయిన సినిమా ‘రాజు గారి గది 3’. ఆ సినిమా విడుదల అయిన రోజు ఒక మోస్తరు జనాలని మాత్రమే ఆకర్షించింది. కొంతమందికి నచ్చింది అంటే కారణం సినిమాలో వారికి హాస్య సన్నివేశాలు బాగా నచ్చాయి ముఖ్యంగా చాలా రోజుల రోజుల తర్వాత ‘ఆలీ’ గారిని తెర మీద చూసుకోవడం వలన మాకు ఉపశమనం దొరికింది అని అన్నారు. కొంతమంది కి అసలు సినిమా మొత్తం నచ్చలేదు అని మొదటి ఆట నుండే నెగెటివ్ టాక్ వచ్చేలా చేశారు అందులో ‘బుక్ మై షో’ కూడా ఒకలు. ఆన్లైన్ లో సినిమాకి టిక్కెట్ ఆధారణ పెరగలేదు అనడానికి కారణం బుక్ మై షో లో ఇచ్చిన % పరంగానే జనాలు ఆ సినిమా వైపు మొగ్గు చూపలేదు. చాలా మంది జనాలు కూడా సినిమాకి తక్కువ రేటింగ్ కూడా ఇచ్చారు. జనాలు సినిమాని చూసి రేటింగ్ ఇవ్వడం వేరు. బుక్ మై షో లాంటి వాళ్ళు రేటింగ్ ఇవ్వడం వేరు.

ఇక ‘రాజు గారి గది 3’ సినిమాకి కొంతమంది నుండి అయిన అంతో ఇంతో మద్దతు లబిస్తుంది అని చెప్పి సక్సెస్ మీటింగ్ ని ఏర్పాటు చేసేసింది సినిమా యూనిట్ వాళ్ళు. ఇక ఆ మీటింగ్ లొ మాట్లాడుతూ ఆలీ, దర్శకులు ఓంకార్, హీరో అశ్విన్ బాబు ముగ్గురు ఆవేధనకి గురి అయ్యారు. వారి మాటల్లో వారు ‘బుక్ మై షో’ ని ఉద్ధేశిస్తూ ‘’నువ్వు ఎవరూ రా అసలు మా సినిమాకి రేటింగ్ ఇవ్వడానికి? సినిమా ఏమన్న ని అబ్బాదా? తోలు తీస్తా ఇంకోసారి ఇలాంటి చెత్త రేటింగ్ లు వేసి జనాలని సినిమా టిక్కెట్ బుక్ చేయకుండా చేస్తే”……అని చెప్పి ఆగ్రహం కూడా వ్యక్తపరిచారు. కొంత సమయం అయిపోయిన తర్వాత హీరో, హీరోయిన్ ఇద్దరు కొంత హాస్యం కూడా చేశారు ఆ మీటింగ్ లో.

మారిన తరం ని బట్టి సినిమాకి కొంచెం ఆధారణ వచ్చినా జనాలు ఆ సినిమాలో ఏదో ఉంది అని వెళ్లిపోతున్నారు. ఒకవేళ వారికి నచ్చితే వారే మంచి రివ్యూ ఇచ్చేస్తున్నారు. నచ్చకపోతే నచ్చలేదని ముందే చెప్పేస్తున్నారు. జనాలు కూడా కొంతమంది యూట్యూబ్ లో బాగా పాపులర్ అవ్వాలి అని చెప్పి సినిమా గురించి అడ్డ దిడ్డంగా చెపేస్తున్నారు రివ్యూ లు. మరి ఇంత గంధరగోళం మధ్య ఆ సినిమాని చూడలేని జనం మాధ్యమాల్లో విడుదల అయ్యేదాక ఎదురుచూసి ఇంటిల్లిపాది కూర్చొని వారి టీవి లోనే చూసుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MYlVGm

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...