Skip to main content

టి.ఆర్.పి రేటింగుల కోసం తుమ్మినా, దగ్గినా మేము కారణం అంటారు ఇలాంటి వాళ్ళు

టి.ఆర్.పి రేటింగుల కోసం తుమ్మినా, దగ్గినా మేము కారణం అంటారు ఇలాంటి వాళ్ళు
టి.ఆర్.పి రేటింగుల కోసం తుమ్మినా, దగ్గినా మేము కారణం అంటారు ఇలాంటి వాళ్ళు

న్యూస్ చానెల్స్ మన తెలుగునాట బాగా పాపులర్ అయ్యాయి. రాజకీయం గురించి డిబేట్స్ పెడతారు, సినిమా స్టార్ల మీద పుకార్లు పుట్టిస్తారు ఇదంతా ఎందుకు అంటే మాకు టి.ఆర్.పి రేటింగు కావలి అంటారు. అవసరమయిన అలాగే జ్ఞానం పెంపొందించే వాటిని చూపిస్తే ఏం వస్తుంది కిక్?….ఇలాంటివి చూపిస్తేనే కదా టి.ఆర్.పి రేటింగు పెరిగేది…మరి చూస్తున్న జనాలు వెర్రి వాళ్ళ? అలా జనాలు గ్రహించడం కష్టమే అని సులువుగా అనుకుంటారు.

టీవీ 9 ఛానల్ ఒకప్పుడు పెద్ద నంబర్ 1 ఛానల్. ఎప్పుడైతే “రవి ప్రకాష్” గారు ఛానల్ నకిలీ సంతకం కారణంగా ఒక్కసారిగా తల దించుకున్న టీవీ 9 ఇకనైనా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ జనాలని వినోదింప చేస్తుందా? అంటే మళ్ళీ కుక్క వంకర తోకలాగానే మేము ప్రత్యక్షంగా చూపిస్తున్న వీడియో అంటూ సొంత డప్పు కొట్టుకుంటుంది. అసలు టీవీ 9 చేసే కార్యక్రమాలలో ‘ఏది వైరల్? ఏది రియల్?’ కార్యక్రమం జనాన్ని తెగ ఇబ్బంది పెట్టేది. అది చాలదు అనుకున్నట్టుగా ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాన్ని మొదలు బెడుతూ మళ్ళీ పాత టి.ఆర్.పి రేటింగుల కోసం పాకులాడుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే మాస్ మహారాజ్ ‘రవితేజ‘ గారు ‘వి.ఐ ఆనంద్’ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘డిస్కో రాజా’. ఆ సినిమా లోని ముఖ్యమైన సన్నివేశాలు కథ కి అనుగుణంగా ‘ఐస్ల్యాండ్’ లో మంచు కొండల మధ్య షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలో ఆ సీన్స్ బాగా ఇంపార్టెంట్ అని విన్నాం కదా. అయితే నిర్మాతలు, కొంతమంది యూనిట్ సభ్యులు ఆ ఫోటోలని మాధ్యమాల్లో పెడితే దానికి టీవీ 9 వాళ్ళు కొంచెం మసాలా జోడించి అనగా ఒక వీడియో తయారు చేసి టీవీ 9 ప్రత్యక్షంగా అందిస్తున్న వీడియో అని చెప్పి జనాలని వెర్రి బాగులోళ్ళని చేస్తుంది టీవీ 9.

అది చూసిన జనం ప్రత్యక్షంగా అంటే లైవ్ లో జరుగుతుండగా ఆ వీడియో ని షూట్ చేయడం కానీ, లేదా మీకు ఆ వీడియో దొరికితే మొదట మీరు చూపిస్తే దాన్ని ప్రత్యక్షం అంటారు కానీ 4,5 ఫోటోలని పెట్టేసి చూస్కోండి అంటే జనాలు మిమ్మల్ని వెర్రి బాగోలోళ్లు అనుకుంటారు అని కింద కామెంట్ రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా టీవీ 9 వారు ఇది గ్రహించి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటుందా? అంటే ఆబ్బె వాళ్ళు అంతే ఇక మారరు అని జనాలు అనుకుంటున్నారు…..అందులో చాల నిజం వుంది అది మనకి కూడా తెలుసు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35CHxR7

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...