Skip to main content

అప్పుడు విలన్ అయ్యాడు…ఇప్పుడు దగ్గరుండి నడిపిస్తున్నాడు

Dil Raaju Gaaru worried about Darbaar movie
Dil Raaju Gaaru worried about Darbaar movie

తెలుగు సినిమాలో పెద్ద నిర్మాత మరియు మంచి పేరు, ప్రఖ్యాతలు  గల నిర్మాత ఎవరు అంటే వెంటనే ‘దిల్ రాజు‘ గారు అంటాము. కారణం ఏదైనా కానీ దిల్ రాజు గారికి సినిమాలు తన కుటుంబం లో భాగస్వామ్యం అయ్యాయి. నిర్మాతగా, పంపిణీదారుడిగా ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ  ఒక మంచి స్థాయి గల  పేరు సంపాదించుకున్నారు దిల్ రాజు గారు.

ఇదే సంవత్సరం రజనీకాంత్ గారి ‘పేట’ సినిమాకి తెలుగులో థియేటర్స్ దొరకటం కష్టం అయ్యింది. సంక్రాంతి రేసులో అప్పటికే ఎఫ్2, వినయ విధేయ రామ, ఎన్.టి.ఆర్. కథా నాయకుడు సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఎఫ్2  సినిమా మాత్రమే విజయం సాధించింది. రజనీకాంత్ గారి పేట సినిమా విడుదల అయ్యింది. సినిమా టాక్ బాగానే వచ్చింది కానీ థియేటర్లు లేక అల్లాడిపోయింది సినిమా. సినిమాకి పంపిణీదారుడు అయిన వల్లభనేని అశోక్ దిల్ రాజు మీద పండిపడ్డారు.

అప్పటికే దిల్ రాజు గారు ఎఫ్2 సినిమాకి నిర్మాత కాబట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  ఒక మాట అన్నారు. తెలుగు సినిమాలే కష్టంగా ఒకొక్కటి సంక్రాంతి రేసులో మంచి రోజు చూసుకొని దిగితుంటే సడెన్ గా తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు దొరకటం కష్టం అని మాట్లాడేసరికి అశోక్ గారికి దిల్ రాజు గారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త రజినీకాంత్ గారి దాకా వెళ్ళింది. అలా రజినీకాంత్ గారి సినిమాకి తెలియకుండానే విలన్ అయిపోయాడు దిల్ రాజు గారు.

ఈ సారి ఎలాగైనా తన తప్పు తెలుసుకోవాలి అని చెప్పి ‘దర్బార్’ సినిమాకి యూ.వి క్రెయేషన్స్ వారితో కలిసి పంపిణీదారుడిగా మారాడు దిల్ రాజు గారు. 2020 సంక్రాంతికి  ఒకే రోజున అనగా జనవరి 12 వ తేదీన అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ “అలా వైకుంఠపురములో” మరియు మహేష్ బాబు-అనిల్ రావిపూడి ”సరిలేరు నీకెవ్వరూ” సినిమాలు పోటాపోటీగా విడుదల అవుతున్నాయి. అలా ఉండటం చూసిన దిల్ రాజు గారు దర్బార్ సినిమాని జనవరి 10 వ తేదీన విడుదల చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు అంటా.

జనవరి 12 తర్వాత అనగా  14 మరియు 15 వ తేదీలలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటించిన  ‘వెంకీ మామ’, కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంతమంచి వాడవురా’ సినిమాలు క్యూ లో ఉన్నాయి. అందుకే దిల్ రాజు దర్బార్ సినిమాకి ఈ సారి ఎలా అయినా విలన్ కావొద్దు అనుకుంటూ ఇప్పటినుండి సమస్యకి తగిన పరిష్కారం జనవరి 10 వ తేదీ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మహేష్ బాబు గారి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి దిల్ రాజు గారు కూడా నిర్మాతల్లో ఒకరు. ఇదంతా చూస్తుంటే అందరూ దిల్ రాజు గారి ముందు జాగ్రత్త ఇద్దరు సూపర్ స్టార్ల కోసం అని అనుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OGTFdJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...