Skip to main content

థాయిలాండ్ లో థ్రిల్లింగ్ గా…

థాయిలాండ్ లో థ్రిల్లింగ్ గా...
థాయిలాండ్ లో థ్రిల్లింగ్ గా…

దర్శకుడు “మోహన్ కృష్ణ ఇంద్రగంటి” గారు సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడతారు. అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంటుంది తెలుగు సినిమా చరిత్రలో. ఇప్పుడు ఇద్దరు హీరో, హీరోయిన్ లతో చేస్తున్న “వి” సినిమా రోజు రోజుకి జనాల మీద ఆసక్తి వచ్చేలా చేస్తుంది.

నాచురల్ స్టార్ ‘నాని’ ప్రతి నాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో…సుధీర్ బాబు హీరో. అదితి రావు హైదరి, నివేద థామస్ కథానాయికలు. దిల్ రాజు గారు వాళ్ళ సోదరులతో కలిసి ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ పై భారీగా నిర్మిస్తున్నారు. మొదటి సారి నాని ప్రతినాయకుడి గా నటిస్తున్నాడు అంటేనే సినిమా కథ మీద, ఆ పాత్ర మీద నానికి ఎంత నమ్మకం ఉంటే ఒప్పుకుంటారు చెప్పండి. అలాగే ఇది వరకు తన కెరీర్ లో 2 బెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా మూడవ సారి ఆ దర్శకుడుని నమ్మి వేస్తున్న అడుగు కాబట్టి సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే సినిమా ఇప్పుడు దక్షిణ తీరం థాయిలాండ్ ‘ఫుకెట్’ దగ్గర షూటింగ్ జరుపుకుంటుంది అని కథానాయకుడు సుధీర్ బాబు గారు తన టీం తో ఉన్న వీడియో ఒకటి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మనతో పంచుకున్నారు. అయితే 2 రోజుల క్రితమే వెన్నల కిషోర్ గారు కూడా సినిమాలో భాగం అయ్యి తాను కూడా ఒక వీడియో పోస్ట్ చేసారు.

అయితే సుధీర్ బాబు, వెన్నెల కిషోర్ గారు షేర్ చేసిన వీడియోలు చూస్తే సినిమా సముద్ర భాగం మధ్య లో జరిగే సన్నివేశాలు అని అర్ధం అవుతుంది. దర్శకులు మోహన కృష్ణ గారు కూడా ఈ వీడియో లో ఉన్నారు. మరి ఆ వీడియో సినిమాలో జరిగే సన్నివేశం అప్పుడు తీసిందా? లేక వాళ్లు కాలీ సమయంలో గడుపుతున్నపటి వీడియోనా? అని అర్ధం కాకుండా ఉంది. జనరల్ గా ఇలాంటి వీడియో లు ఎవరన్నా పంచుకుంటే ఇలాంటి సందేహాలు రావడం సర్వ సాధారం కానీ ఈ వీడియో లో దర్శకులు కూడా ఉండే సరికి సందేహం ఇంకా ఎక్కువ అవుతుంది.

సుధీర్ బాబు గారు ట్వీట్ లో “మా సినిమా ‘వి’ గేలరీ లో నుండి వెన్నెల కిషోర్ గారితో ముందు జరిగే అడ్వెంచర్ సీన్ కోసం షెడ్యూల్ జరుగుతుంది. మేము బాగా ఆ అడ్వెంచర్ సీన్స్ రావాలి అని, అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము” అని అన్నారు. మరి దీంట్లో అర్ధం చేసుకుంటే సినిమా సీన్ కోసం జరుగుతున్నది అని ఇట్టే అనిపిస్తుంది కదా. మరి ఇకనైనా దర్శకులు ఇలాంటి ముఖ్యమైన సీన్స్ షూట్ జరిగేటప్పుడు లీక్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది అని జనాలు అనుకుంటున్నారు.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2oLxsQM

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...