Skip to main content

మా రాజకీయాలు అంటే పిల్ల ఆటలు అనుకుంటున్నారు.

మా రాజకీయాలు అంటే పిల్ల ఆటలు అనుకుంటున్నారు.
మా రాజకీయాలు అంటే పిల్ల ఆటలు అనుకుంటున్నారు.

రాజీకీయాల గురించి ఎమన్న వార్తలు వచ్చాయంటే చాలా మంది ఇంటరెస్ట్ గా చూస్తారు. అందులో ఎవరెవరూ ఏమనుకున్నారు? ఒకరి మీద ఒకరు మండిపడ్డారా? లేక అభిప్రాయం బేధాలు వచ్చి ఒకలిని ఒకలు తెగ తిట్టేసుకున్నారా? అని ఒక పక్క నుండి కాకుండా గొడవలని ఎన్ని పక్కల నుండి చూడాలో అన్ని పక్కల నుండి చూసేస్తారు జనాలు. మరి రాజకీయాలు అంటేనే అలానే చూడాలి కదా..

2019 లో అసలు రాజకీయాల కంటే బుల్లితెర అయిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఒక వర్గాల వారికి ఇంకొక వర్గాల వారికి అస్సలు పడట్లేదు. అధ్యక్షుడు లేకుండా ఎవరికీ వారు సమావేశాలు పెట్టేస్తున్నారు. మొదటి నుండి చెప్పాలి అంటే అప్పుడు ఎమో రాజేంద్ర ప్రసాద్ – హేమ ల మధ్య వివాదాలు తలెత్తితే ఈ సంవత్సరం నరేష్ – శివాజీ రాజాల మధ్య మేము అంటే మేము అని తెగ గొడవలు పడి ఇరు వర్గాలు వారికి దొరికిన సభ్యుల సహాయంతో బరిలోకి దిగారు.

మొత్తానికి ఆ బరిలో నరేష్ వర్గాల వారికి తెలుగు పరిశ్రమ అందరూ సహకరించి అధిక ఓట్లు వేశారు వారిని గెలిపించారు. శివాజీ రాజా గారు అప్పటి నుండి సైలెంట్ అయిపోయారు. బహుశా ఓటమిని భరించలేక ఎవరికీ కనపడకుండా ఉన్నాడు అనుకున్నారు కానీ నేను అలాంటి మనిషిని కాదు కేవలం సంబరాలు జరుపుకుంటున్న వారిని ఇబ్బంది పెట్టలేక నేను సైలెంట్ అయిపోయాను, ఒకవేళ నరేష్ ఆధ్వర్యంలో ఎమన్నా తేడా జరిగితే మేము తిరగబడతాం అని మీడియా వారి సాక్షిగా తన వ్యక్తిత్వాన్ని మరో సారి నిరూపించుకున్నారు.

ఇక నరేష్ వర్గం లో ముక్యులు ఎవరు అంటే భార్య భర్త అయిన ‘జీవిత రాజశేఖర్ – రాజశేఖర్’ ఇరువురు నరేష్ గారికి బాగా చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటిది వారిలో వారికి ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండిపోతున్నారు. అధ్యక్షుడు అయిన నరేష్ గారికి ఎటువంటి మాట చెప్పకుండా మిగిలిన వారిని పోగేసుకొని సమావేశాలు పెట్టేసుకున్నారు. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో నరేష్ వర్గాల వారికి రాజశేఖర్ వర్గాల వారికి మీది తప్పు అంటే మీది తప్పు అని ఒకరిని ఒకలు దూషించుకున్నారు. అందులో కొంతంది సమావేశం జరుగుతుండగా మధ్యలో లేచి వెళ్లిపోయారు.

అసలు సమావేశము ఎందుకు పెట్టారో? ఎవరిని ఉద్దేశించి పెట్టారో? మాకు చెప్పకుండా ఇలా చేస్తారా? అలా చేస్తారా? ఎవరు పడితే వారు అధికారాల్ని చేతులోకి తీసుకొని సమావేశాలు పెట్టేస్తారా? రాజకీయాలు అంటే చిన్న పిల్ల ఆటలు అని కూసింత చిన్న పాటి గొడవలు జరిగాయి అని చిత్ర రంగాల వారికి వార్తలు అందినట్టుగా అనిపిస్తున్నాయి. అయితే పరుచూరి గోపాల కృష్ణ గారు సమావేశం మధ్యలో కంట తడి పెట్టుకొని సమావేశం మధ్యలో వెళ్లిపోవడం, కృష్ణంరాజు తరుపున ఉన్నవారు నరేష్ గారు ఉండగా జీవిత రాజశేఖర్ గారు సమావేశాన్ని నడిపించడం లాంటి వాదనలు చూస్తుంటే ‘మా’ రాజకీయాలు అంటే పిల్ల ఆటలాగే ఉంటాయా? అని మనకి అనిపిస్తుంది కదా…..



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35SDUqv

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...