Skip to main content

పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా ‘మహేష్ బాబు’ మాత్రమే కావాలంటా…

పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా 'మహేష్ బాబు' మాత్రమే కావాలంటా...
పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా ‘మహేష్ బాబు’ మాత్రమే కావాలంటా…

మనకి నచ్చిన నటీనటుల ని జీవితంలో ఒక్కసారి అయిన కలవాలి, వారితో కలిసి ఫోటో దిగాలి వారి సంతకాన్ని తీసుకోవాలి అని అందరం అనుకుంటాము. దానికోసం చాల కష్ట పడుతాం…..కొన్ని స్వచ్చంద సంస్థలు ‘మేక్ ఏ విష్’ అంటూ చేపట్టిన కార్యక్రమాలు కూడా చూసాం. కానీ ఇప్పుడు నేను చెప్పే సంఘటన వింటే నిజంగానే ఆశ్యర్యపోతారు. ఆ సంఘటన మహేష్ బాబు కోసం జరిగింది, అలా చేసింది ఒక మహిళ.

విజయవాడ లోని ఒక మహిళ చెట్టు ఎక్కి “ఇక్కడికి వెంటనే మహేష్ బాబు గారు రావాలి నా సమస్యకి పరిష్కారం మహేష్ బాబు గారు ఒక్కరే” అని ఆ ఏరియా ని ఒక్కసారిగా బయపెట్టేసింది. అలా చేసిందంటే మనం ఏమనుకుంటాము? సరేలే మహేష్ బాబు గారి మీద, ఆయన సినిమాల మీద ఇష్టం ఎక్కువ ఉందేమో? ఇలా చేయడం తప్పు అని కొంతమంది నచ్చ చెప్పారు. కానీ ఆమె అస్సలు వారి మాట వినలేదు. కిందకి దిగమని అడిగారు, నేను దిగాను అన్నది. వింతగా,భలేగా ఉన్నది ఈ అమ్మాయి అని చెప్పి ఫోటో, వీడియో తీస్తుంటే చెట్టు కొమ్మలు ఇరగొట్టి వారి మీద విసిరేసింది.

కొంత సమయం తరువాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే…..”మహేష్ బాబు గారు రావాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడాలి…అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నా బాధ అర్ధం చేసుకోవాలి” అంటూ పోలీసుల ముందు గట్టిగా అరిచింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు నెమ్మదిగా చెట్టు ఎక్కి కిందకి దింపాలి అనుకున్నారు. అప్పటికి ఆ ఏరియా లో ట్రాఫిక్ సమస్య ఎక్కువయింది. చెట్టు నుంచి నేను దిగను అని ఆ మహిళ మొరాయించింది పొలుసులతో.

ఇక పోలీసులు వెనక నుండి చెట్టుకి నిచ్చెన వేసి ఆ మహిళ ని కిందకి దింపేసారు. విజయవాడ లోని రెవిన్యూ కాలనీ అగ్రిగోల్డ్ కార్యాలయం ఎదురుగ్గా ఆ చెట్టు ఉంది. ఇక పోలీసులు ఆ మహిళ ఎందుకు ఇలా చేసింది? అని ఆరా తీస్తే ఆ మహిళ కోల్ కత్తా నుండి విజయవాడ కి వలస వచ్చిందని, తనని డబ్బులు మిగిలిన సమస్యల విషయంలో మోసం చేసారని అందుకే మతి స్థిమితం కోల్పోయి ఇలా చేసిందని విచారణలో తేలింది.

ఇక జనాలు కూడా ఆమె అలా చేసే సరికి మొదట మహేష్ బాబూ గారు వస్తారు అని మహేష్ బాబు అంటే మాకు కూడా ఇష్టం అని….ఆతృతగా ఎదురుచూస్తున్న జనాలకు చివరకు ఆ మహిళకి పిచ్చి పట్టి ఇలా చేస్తుంది అని తెలిసి వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మొత్తానికి మహేష్ బాబు అనేసరికి అందరికి ఉస్తాహం వచ్చింది. అందరికి ఆయన్ని చూడాలని ఉంటుంది కదా అనుకున్నారు జనాలు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ORgiwf

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...