Skip to main content

ఆటలు ఆడిపించాలి కానీ మనుషులతో కాదు

ఆటలు ఆడిపించాలి కానీ మనుషులతో కాదు
ఆటలు ఆడిపించాలి కానీ మనుషులతో కాదు

మొన్న ఆదివారం కనుక జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ లో ఎవరు బయటికి పోతారు? అని ఆత్రుతగా జనాలు టీవీ ల ముందు కూర్చొని చూస్తున్నారు “బిగ్ బాస్” షో ని. ఎవరో ఒకలు వెళ్లాల్సిందే కదా అని అనుకునే వారు కొంతమంది అయితే మాకు నచ్చిన అతను – ఆమె ఎలిమినేట్ కావద్దు అని కొంతమంది అనుకుంటారు. అలా అనుకుంటూ ఉండగా చివరికి మొగుడు పెళ్ళాలు అయిన వరుణ్ – వితిక ఇద్దరిలో ఒకలు ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పి…..నాగార్జున గారు చిన్న విరామం తీసుకొని వచ్చి వితిక ని ఎలిమినేట్ చేసేసారు.

తన భార్య ఎలిమినేషన్ నీ తట్టుకోలేక పోయిన వరుణ్ చాలా ఏడ్చేసారు. అయితే వితిక ఎలిమినేట్ కావడం నాగార్జున గారికి ముందే తెలుసో లేదో తెలీదు కానీ గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఓట్లు వేసిన జనాలకి అయితే వితిక ఎలిమినేట్ కావడం ఖాయం అని ట్విట్టర్ లో, ఇస్టాగ్రాం లో జనాలకి తెలిసిపోయింది. కారణం అప్పటికి మాధ్యమాల్లో వితిక గురించి గట్టిగానే ప్రచారం ఊపందుకుంది. అసలే ఇది బిగ్ బాస్ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఆ బిగ్ బాస్ కే తెలీదు. వితిక ఎలిమినేషన్ కావడం తప్పుడు ఆరోపణ అని జనాలకి ఒక మాదిరి అనుమానం కూడా ఉంది. అందుకే కొంతమంది వితిక ఎలిమినేషన్ కావడం కుదరదు అని గట్టి నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి మాధ్యమాల్లో వచ్చిన వార్త నిజం చేస్తూ వితిక ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. వెళ్తూ వరుణ్ ని కంటతడి పెట్టవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది.

ఇక సోమవారం ఎపిసోడ్ లో 92 రోజులకీ చేరిన బిగ్ బాస్ ‘టిక్కెట్ టు ఫైనల్’ కి మిగిలిన 6 గురిలో ఒకలు గెలిచి ఫైనల్ కి వెళతారు మిగిలిన 5 గురు నామినేషన్ లోకి వెళ్తారు అని చెప్పారు ఆ టాస్క్ గురించి. అప్పటికి ప్రోమో లో ఏదో జరుగబోతోంది అని చూపించిన బిగ్ బాస్ మిగిలిన 6 గురు సభ్యులకి ఒక కొత్తరక మైన టాస్క్ ని ఇచ్చారు. ఎదురుగా ఉన్న బోర్డ్ మీద మీకు నచ్చిన కలర్ పలకని తీసుకొమ్మని 6 పలకలు పెట్టారు. అందరూ వారికి నచ్చిన కలర్స్ తీసుకున్నారు. అందులో 40%, 50%, 70% అని ఇలా ఉన్నాయి. అలా ఉన్న నంబర్స్ వారి బ్యాటరీ సామర్థ్యం నిరూపించుకోవాలి అని వాటిని తగ్గకుండా తగిన టాస్క్ చేయాలి అని ఒక మెలిక పెట్టారు. ఆ టాస్క్ పేరు “బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండుగ” అని కూడా చెప్పారు.

గార్డెన్ ఏరియా లో రెండు గంటలు పెట్టి ఎవరైతే ఇద్దరు గంట కొట్టి టాస్క్ ఆడి గెలిస్తే వారి బ్యాటరీ 10% పెరుగుతుందని అని ఓడిపోతే 10% తగ్గుతుందని చెప్పారు. ఒకసారి గంట కొట్టిన ఇద్దరికీ ఇంకొకసారి గంట కొట్టే అవకాశం లేదని చెప్పారు. మొదటి వరుసలో అలీ రెజా కి – శివ జ్యోతి కి టాస్క్ పడింది వారిలో ఎవరైతే నిండు అరటి గెల లో ఎక్కువ అరటిపండ్లు ఎవరు తింటే వారు గెలిచినట్లు అన అన్నారు. శివ జ్యోతి 15 అరటిపండ్లు తినగా ఆలీ రెజా 21 తిన్నాడు. ఆలీ రెజా గెలిచి 10% బ్యాటరీ ఛార్జింగ్ పెంచేసుకున్నాడు. ఇక శివజ్యోతి కి ఆలీ రెజా కి ఇంకొక సారి గంట కొట్టే అవకాశం లేదు.

తర్వాత ఇద్దరిలో టాస్క్ వరుణ్ – రాహుల్ కి పడింది. అప్పటికి శ్రీముఖి బయపడుతూ ఉంది. పుసుక్కున తనకి రాహుల్ కి ఎక్కడ టాస్క్ పడుతుంది అని సేఫ్ గేమ్ ఆడుతూ ముందే ప్రణాళికా వేసుకుంది. ఒకసారి బాబా బాస్కర్ – శ్రీముఖి కి టాస్క్ పడింది బాబా బాస్కర్ గెలిచి 10% ఛార్జింగ్ పెంచుకున్నాడు. రాహుల్ – వరుణ్ లో రాహుల్ గెలిచి తన బ్యాటరీ 10% పెంచేసుకున్నాడు. ఇంతటితో సోమవారం రోజు ఎపిసోడ్ అయిపోయింది. ఓడిపోయిన వారు 10% బ్యాటరీ తగ్గించుకుని గెలిచిన వారు 10% బ్యాటరీ పెంచేసుకున్నారు. వారి అందరిలో ఆలీ రెజా ముందు వరుసలో ఉన్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్ ప్రోమో చూపిస్తూ ఆలీ రెజా కి బాబా బాస్కర్ కి పోటీగా టాస్క్ ఇచ్చారు.

అసలే రీ-ఎంట్రీ తర్వాత ఆలీ రెజా బాబా గారి మీద కూసింత ఆగ్రహం గానే ఉన్నాడు. మంగళవారం ఎపిసోడ్ లొ కూడా ఆలీ బాబా గారిని డిఫెన్స్ చేసుకుంటున్నాడు అందుకోసం బాబా గారిని తోసెయ్యడం వగైరా అన్నీ ప్రోమోలో కనిపిస్తుంది. ఒకవేళ వారి ఇద్దరిలో ఎవరికి అయినా గాయాలు తగిలితే మళ్ళీ బిగ్ బాస్ గారే టాస్క్ రద్దు అయింది అని చెప్తారు. ఇంత చేసే బిగ్ బాస్ టాస్క్ అంటే గేమ్ ఆడిపించాలి కానీ మనుషులతో కాదు బిగ్ బాస్ అని బాబా తరపు అభిమానులు అగ్రహంగా ఉన్నారు. అలాగే శ్రీముఖి కి రాహుల్ కి మద్య ఇలాంటి టాస్క్ వచ్చేలా చేయమని రాహుల్ అభిమానులు వేడుకుంటున్నారు.

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JbBARr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...