Skip to main content

మొన్న సూర్య గారిని కలిసారు…ఇప్పుడు రామోజీ రావు గారిని కలిసారు…కారణం?

మొన్న సూర్య గారిని కలిసారు...ఇప్పుడు రామోజీ రావు గారిని కలిసారు...కారణం?
మొన్న సూర్య గారిని కలిసారు…ఇప్పుడు రామోజీ రావు గారిని కలిసారు…కారణం?

బహుముఖ ప్రజ్ఞశాలి అయిన కలెక్షన్ కింగ్ ‘మోహన్ బాబు’ గారు ఈ మధ్య పథకం ప్రకారంగా అడుగులు వేస్తున్నారు. కారణం ఏమైనా కానీ మనకి ముందుగా క్లూ ఇస్తున్నారు. కుమారులు ఇద్దరు చేస్తున్న సినిమాలు మంచిగా ఆడటం లేదు నిర్మాతలు ముందుకి రావటం లేదు. కుమార్తె బుల్లితెర మీద మంచి ఆదరణ ఉన్న కార్యక్రమాలు చేసుకుంటుంది. మరి కుమారుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న మోహన్ బాబు గారు ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఒక 10 వారం రోజుల ముందు తమిళ హీరో ‘సూర్య’ గారిని ఇంటికి పిలిపించారు. భోజనానికి పిలిచారు అని అందరు అనుకున్నారు అలాగే సూర్య నటించిన ‘బందోబస్త్’ సినిమా ప్రమోషన్స్ కి వస్తే ఇలా అనుకోకుండా మోహన్ బాబు గారి కుటుంబాన్ని కలిసారు అని తెలిసింది అనుకున్నాం. కానీ కథలోకి వెళ్తే ‘సూర్య-సుధా కొంగర’ దర్శకత్వంలో రాబోతున్న ‘సూరారై పోట్రు’ సినిమాలో మోహన్ బాబు గారు ఒక పాత్ర చేస్తున్నారు అని అది కథలో కీలకం. అలా చేయబోయే సినిమాకోసం ముందుగా ఇద్దరు ఒకరికి ఒకరు పరిచయం పెంచుకోవాలి అనుకున్నారు అందుకే ఇంటికి పిలిపించారు అని అనుకున్నాం.

అంతే కాకుండా అలా కలిసిన వారు అదే రోజు మన దర్శకులు ‘బి.వి.ఎస్ రవి’ గారి దగ్గర ఉన్న ఒక కథని సూర్య గారికి వినిపించారు. సూర్య గారు ఆ కథ విని ఒకే చెప్పారు, కానీ డేట్స్ సర్దుపాటు చేసుకొని సినిమాని చేస్తాను అని మాట ఇచ్చారు. మరి ఆ సినిమాకి మోహన్ బాబు గారు నిర్మాతగా ఉంటారు అని అన్నారు. మరి అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. సూర్య గారిని ఇంటికి పిలవటం వెనుక ఇంత కారణం ఉంది. అలా అనుకున్న మోహన్ బాబు అభిమానులు ఇంకొక వార్త గురించి కూడా అలానే అనుకుంటున్నారు. అదేమిటి అంటే…..

ఈనాడు సంస్థల అధినేత మరియు ‘ఉషా కిరణ్ మూవీస్’ నిర్మాతలు అయిన ‘రామోజీ రావు’ గారిని మోహన్ బాబు గారు కలిసారు. వారితో విద్య, సినిమా, రాజకీయాల గురించి మాట్లాడినట్లు మోహన్ బాబు గారు మీడియా ముందు చెప్పారు. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత ట్విట్టర్ లో రామోజీ రావు గారిని ఉద్దేశిస్తూ…”రామోజీ రావు గారు మారుతన్న తరాలకి చెరగని ఎన్‌సైక్లోపీడియా…ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను..ఆయనతో మాట్లాడిన మాటలు నేను మరిచిపోలేను అని అన్నారు”.

అప్పుడు సూర్య గారిని కలవడం వెనుక అంత కారణం ఉంటే…ఇప్పుడు కలిసిన రామోజీ రావు గారి విషయంలో కూడా పెద్ద ఎత్తున సినిమా గురించో? లేక రాజకీయాల గురించో? చర్చ జరుగుతుంది అని సినిమా విశ్లేషకులు అనుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31kJVsf

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...