Skip to main content

ట్రెండ్ మారుతుంది. సినిమాలో పాటలు, రొమాన్స్ ఉండట్లేదు.

Kaarthi's Khaidi
Kaarthi’s Khaidi

ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే హీరోయిన్స్ అందం, అభినయం ఉంటాయి అని  జనాలు థియేటర్ లకి పరుగులు తీసేవారు. ప్రత్యేకంగా చెప్పాలంటే దర్శకుడు ‘కె.రాఘవేంద్ర రావు‘ గారి సినిమాలు విడుదల అవుతున్నాయంటే హీరోయిన్స్ ని బాగా చూపిస్తారు అని నమ్మకంతో సినిమాని చూసిన వారు కూడా ఉన్నారు. అదే ట్రెండ్ ని కొంతమంది దర్శకులు కూడా ఫాలో అయ్యేవాళ్ళు.

ట్రెండ్ అంటేనే మారడం. మార్పు కోరుకోవడం. అలాంటిది ఎప్పుడూ అవే కథలు, అవే ఫార్ములా వర్క్ అవుట్ అవ్వడం అంటే కష్టం కదా. ఒక్కోసారి సినిమాలో కథ బాగుంటే, అడ్డదిడ్డమైనా పాటలు, హాస్యానికి చోటు ఉండదు. కానీ కొంతమంది దర్శకులు వాటిని సినిమాలో ఇరికించి మంచి కథ, కథనం ఉన్న సినిమాని చెడగొట్టేసారు. అలా చెడగొట్టిన  సినిమాలు దాదాపు వేల సంఖ్యలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిన సమస్య అంటే….

తమిళ సినిమా వాళ్ళు ఆ ఫార్ములాని, ట్రెండ్ ని మార్చి సినిమాలు తీసి హిట్ కొట్టేస్తున్నారు. కొన్ని సినిమాలకి పాటలు, హాస్యం, వగైరా ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి వాటి జోలికి పోకుండా సినిమాని ఆసక్తిగా మరచాలి, ఆధ్యంతం కథ ముందుకి పోవాలి అని చెప్పి సినిమాలు తీసి హిట్ కొట్టేస్తున్నారు. గత సంవత్సరం విడుడల అయిన విశాల్ ‘డిటెక్టివ్’ సినిమా చూసుకుంటే సినిమాలో ఒక్క పాట కూడా ఉండదు, అడ్డదిట్టమైన హాస్యం లాంటివి కథకి అడ్డుగా ఏమి రావు.

అందుకే సినిమా మొదటి నిమిషం దగ్గర నుండి చివరి నిమిషం వరకు చాలా ఉత్కంఠ భరితనంగా తరువాత ఎం జరుగుతుంది అని జనాలని థియేటర్ లో కూర్చునేలా చేసింది. సినిమా విజయం కూడా సాధించింది. అందుకే అదే కోవకి చెందిన ఇంకొక కథ ఇప్పుడు అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ పాటలు కానీ, రొమాన్స్ కానీ ఏం లేకుండా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయనడానికి వస్తుంది. సూర్య తమ్ముడిగా తెలుగు, తమిళ ప్రేక్షకులకి పరిచయం అయిన ‘కార్తీ‘ తదుపరి సినిమా గురించి ఇప్పుడు ఆసక్తి పెరిగింది అందరిలో.

‘లోకేష్ కనగరాజ్’ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, తిరుప్పూర్ వివేక్ నిర్మాతలుగా కార్తీ నటిస్తున్న సినిమా ‘ఖైదీ‘ విడుదలకి సిద్ధం అవుతుంది. సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఖైదీ సినిమాలో కూడా పాటలు, రొమాన్స్ ఏమి ఉండవు, ఓన్లీ యాక్షన్ మాత్రమే ఉంటుంది అని కార్తీ గారు ట్వీట్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే కూడా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నారు అందరు. దీపావళికి విడుదల అవుతున్న సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VMdGBm

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...