Skip to main content

ప్రిన్స్ అభిమానులకి దీపావళి ట్రీట్! వచ్చే నెల ఐటెం సాంగ్ కూడా!

ప్రిన్స్ అభిమానులకి దీపావళి ట్రీట్! వచ్చే నెల ఐటెం సాంగ్ కూడా!
ప్రిన్స్ అభిమానులకి దీపావళి ట్రీట్! వచ్చే నెల ఐటెం సాంగ్ కూడా!

దర్శకులు ‘అనిల్ రావిపూడి‘ గారు ఇప్పటి వరకు చేసిన 4 సినిమాలు ఒక ఎత్తు అయితే మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమాకోసం ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు……సినిమా పేరు ‘సరిలేరు నీకెవ్వరూ‘ అని మనకి తెలుసు. మహేష్ బాబు ని ఇప్పటివరకు ఎవరు చూపియ్యని ఆర్మీ మేజర్ పాత్రలో చూపించి ధైర్యం చేస్తున్నారు అనిల్ గారు. సినిమాకి పోటీగా వచ్చే సంక్రాంతికి 4 సినిమాలు పోటీపడుతున్నాయి.

అనిల్ సుంకర, దిల్ రాజు, మాహేష్ బాబు ముగ్గురు కలిసి తమ సొంత బ్యానర్ లో సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘రష్మిక మందన్న’ కథానాయికగా మొదటి సారి మహేష్ బాబు గారితో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో విజయశాంతి గారు, రాజేంద్ర ప్రసాద్, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజు, బండ్ల గణేష్, సంగీత, హరితేజ, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ  లాంటి పెద్ద తారాగణం నటిస్తున్నారు. సినిమాలో చిన్న లోపం కూడా లేకుండా ప్రతి సీన్ ని దగ్గరుండి మరీ తెరెకెక్కిస్తున్నారు దర్శకులు అనిల్ రావిపూడి గారు. అయితే సినిమా నుండి కొత్తగా ఒక పోస్టర్ బయటికి వచ్చింది.

దర్శకులు తన ట్విట్టర్ ద్వారా ‘సినిమా మొత్తానికి షూటింగ్ అయిపోవడానికి వచ్చింది. విలన్ హౌస్ షెడ్యూల్ ముగించుకొని చివరి షెడ్యూల్ కోసం మేము సిద్ధం అవుతున్నాము. దీపావళి ట్రీట్ కోసం మీరు సిద్ధంగా ఉండండి’ అని అన్నారు. అయితే దీపావళి పండగకి ప్రిన్స్ అభిమానులకి ఒక పాట గాని లేక ఇంకొక టీజర్ కానీ, ఇదంతా కుదరదు అని విజయశాంతి గారి ఫోటో ఉన్న పోస్టర్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారు నటిస్తున్న సినిమా కనుక ఈ సారి అలా అయిన పోస్టర్ రిలీజ్ ఉండొచ్చు అనుకుంటున్నారు.

ఇక పోతే ఈ సినిమాలో తమన్నా తో ఐటెం సాంగ్ చేయిద్దాం అనుకున్న అనిల్ రావిపూడి గారు. ఈ చివరి షెడ్యూల్ లో తమన్నా కోసం ప్రత్యేకంగా ఒక 1970 కాలంనాటి ఆర్మీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఒక అద్భుతమైన పాటని అనుకుంటున్న అనిల్ గారికి దేవి శ్రీ ప్రసాద్ గారు ఒక  మంచి పాటని వినిపించారు. ఈ చివరి షెడ్యూల్ లోనే ‘పూజహెగ్డే’ తో ఇంట్రడక్షన్ పాట కూడా ఒకటి షూట్ చెయ్యాలి అని నృత్యదర్శకులకి చెప్పాడు అనిల్ రావిపూడి గారు. ఇక చూసుకుంటే సంక్రాంతి పోటీకి ఏ మాత్రం తగ్గకుండా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాని జాగ్రత్తగా అనిల్ రావిపూడి గారు సిద్ధం చేస్తున్నారు.

సినిమాలో కథానాయికల పరంగా లోటు లేకుండా ముగ్గురుని ఎంచుకోవడం. మహేష్ బాబు గారిని కొత్తగా చూపించడం, విజయశాంతి గారి నటన, యాక్షన్ , కామెడీ, ఐటెం సాంగ్స్ ఇవన్నీ కలిసి సినిమాని మహేష్ అభిమానులు ఆకాశానికి లేపడం ఖాయమని అంటున్నారు సినిమా విశ్లేషకులు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pE5kzL

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...