Skip to main content

బిగ్ బాస్ లో అసలు మజా.. టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?

బిగ్ బాస్ లో అసలు మజా.. టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?
బిగ్ బాస్ లో అసలు మజా.. టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?

బిగ్ బాస్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఈ షో ఎందుకింత పాపులర్. ఇందులో అంతలా ఏముంది అనే సమాధానాలు వస్తే నిన్న జరిగిన ఎపిసోడ్ ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. నిజానికి తెలుగులో మొదటి రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్ చాలా చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ లో పోటీతత్వం లేకపోవడం, టాస్క్ లు కూడా అంత ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. అయితే మరో రెండు వారాల్లో బిగ్ బాస్ ముగుస్తుందనగా అసలైన టాస్క్ కంటెస్టెంట్స్ కు ఎదురైంది.

టికెట్ కు ఫినాలే అని చెప్పి నామినేషన్స్ ప్రాసెస్ ను సరికొత్తగా నిర్వహించాడు బిగ్ బాస్. దీని ప్రకారం హౌజ్ మేట్స్ అందరూ కొన్ని టాస్క్స్ ఆడాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లలో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే వారు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు. అంటే వారు డైరెక్ట్ ఫైనల్స్ కు వెళ్తారన్నమాట. మిగిలినవారు అందరూ నామినేషన్స్ లో ఉంటారు. అందులోనుండి ఒకరు ఎలిమినేట్ అవుతారు, మిగిలినవారు ఫైనల్స్ కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే అందరికీ ఎంతో ముఖ్యం. ఏ టెన్షన్ లేకుండా వీక్ అంతా ఆడటానికి ఇది ఉపయోగపడుతుంది.

అందుకే కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ గేమ్ ను పక్కనపెట్టి తమ శక్తిమేరకు ఈ టాస్క్ లో కష్టపడుతున్నారు. అందుకే చూసే ప్రేక్షకులకు మజా వస్తోంది. అసలు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ ఏమిటంటే.. మొదట బిగ్ బాస్ ఆరుగురు కంటెస్టెంట్స్ కు ఒక్కొక్కరికి ఒక్కో బోర్డు సెలక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. ఇవి ఆ కంటెస్టెంట్స్ కు బ్యాటరీస్ లాంటివి. ఇందులో అలీకి 70 శాతం రాగా, బాబాకు 40 శాతం, శ్రీముఖికి 50 శాతం, వరుణ్ కు 40 శాతం, రాహుల్ కు 50 శాతం, శివజ్యోతికి 60 శాతం బ్యాటరీ లైఫ్ వచ్చింది. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ పూర్తయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ బ్యాటరీ ఉంటుందో వాళ్ళు టికెట్ గెలిచినట్లు.

ముందుగా అలీ, శివజ్యోతి మధ్య మొదటి టాస్క్ జరగగా వారికి చెరొక అరటిపండు గెల ఇచ్చి ఎవరు ఎక్కువ అరటిపండ్లు తింటే వారు గెలిచినట్లు అని చెప్పారు. అలీ 21 అరటిపండ్లు తినగా, శివజ్యోతి 15 మాత్రమే తింది. దీంతో అలీ గెలుపొందాడు. తర్వాత టాస్క్ రాహుల్, వరుణ్ కు మధ్య జరిగింది. ఇద్దరికీ చెరొక థెర్మోకోల్ బ్యాగ్ ఇచ్చి ఎదుటివారి బ్యాగ్ ను ఎవరు ముందు ఖాళీ చేస్తారో వాళ్ళు గెలిచినట్లు అని చెప్పారు. ఈ టాస్క్ లో రాహుల్ గెలిచాడు. తర్వాతి టాస్క్ బాబా, శ్రీముఖి మధ్య జరిగింది. ఇందులో బాబా గెలుపొందాడు.

సెకండ్ ఫేజ్ లో అర్ధరాత్రి రెండున్నరకు అలీ, బాబా మధ్య టాస్క్ జరుగుతోంది. ఇందులో ఎవరు గెలుపొందారో ఇవాళ తెలుస్తుంది. దీంతో పాటు టికెట్ టు ఫినాలే గెలిచేవారు ఎవరో కూడా తెలిసిపోతుంది. ప్రస్తుతం బ్యాటరీ లైఫ్ బట్టి చూస్తే అలీకి 70 శాతం లైఫ్ ఉంది కాబట్టి తనకే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ ఇది బిగ్ బాస్ హౌజ్. ఇక్కడ ఏదైనా జరగొచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32xlmd8

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...