Skip to main content

ధోనిపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కిన గౌతమ్ గంభీర్

Gautham Gambhir criticizes Dhoni again
Gautham Gambhir criticizes Dhoni again

గౌతమ్ గంభీర్.. టీమిండియా గర్వించే క్రికెటర్లలో ఒకడు. రెండుసార్లు టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు గంభీర్. 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ గంభీర్ ఆటతీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండిట్లోనూ తన ప్రదర్శనే జట్టును విజయతీరాలకు చేరేలా చేసింది. ముఖ్యంగా 2011 ఫైనల్స్ లో గంభీర్ పెర్ఫార్మన్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు అంటే ఈ ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఫైనల్స్ లో శ్రీలంకపై లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. అద్భుత ఫామ్ లో ఉన్న టెండూల్కర్ తక్కువ స్కోర్ కే అవుట్ అయిపోయి ఇండియాను నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో ధోనితో కలిసి గంభీర్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వ్యక్తిగతంగా 97 పరుగులు చేసిన గంభీర్ శతకం కొట్టే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే తర్వాత ధోని తిరుగులేని ఆటతీరుతో జట్టుకి విజయం అందించి భారత్ ను వరల్డ్ కప్ విన్నర్ ను చేసాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. మొదట కష్టమంతా తాను పడితే తర్వాత ధోని వచ్చి క్రెడిట్ తీసుకెళ్లిపోయాడు అంటూ గంభీర్ ఇప్పటికె చాలా సందర్భాల్లో తన అసహనాన్ని వ్యక్తపరిచిన సంగతి తెల్సిందే.

నిజానికి ధోని కెప్టెన్ అయ్యాక ఓపెనర్స్ లో రొటేషన్ పాలసీని తీసుకొచ్చి గంభీర్, సెహ్వాగ్, టెండూల్కర్ లలో ఇద్దరికే స్థానం ఉంటుందని చెప్పాడు. వారి వల్ల ఫీల్డింగ్ లో వెనుకబడుతున్నామని ధోని ఫీల్ అయ్యాడు. ఈ క్రమంలో గంభీర్, సెహ్వాగ్ నెమ్మదిగా జట్టులో స్థానం కోల్పోయాడు. గంభీర్ రిటైర్ అయినప్పటినుండి ధోనిపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. జట్టులో బాగా ఆడుతున్న సీనియర్లమైన మా ముగ్గురిని ఇబ్బంది పెట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ లో క్రెడిట్ కూడా తీసేసుకున్నాడు అన్న తరహాలో వ్యాఖ్యానించిన గంభీర్ ఇప్పుడు మరోసారి ధోని మీద పడ్డాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్స్ లో తాను సెంచరీ మిస్ అవ్వడానికి ధోనీనే కారణమని పేర్కొన్నాడు. ఇది పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

వివరాల్లోకి వెళితే.. వరల్డ్ కప్ ఫైనల్స్ లో తాను ఇండియాను నెగ్గించాలన్న పట్టుదలతోనే ఆడుతున్నాను. వ్యక్తిగత స్కోర్ ఎంత ఉందన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అయితే సరిగ్గా నేను 97 పరుగులు దగ్గర ఉన్నప్పుడు ధోని నా దగ్గర వచ్చి ఇంకో మూడు పరుగులు చేస్తే సెంచరీ సాధిస్తావ్, సెంచరీ చేసేయ్ అని నాకు చెప్పాడు. అప్పటిదాకా నా స్కోర్ ఎంత అన్నది కూడా పట్టించుకోని నాకు సెంచరీపైకి మనసు వెళ్ళింది. భారీ షాట్ కోసం ప్రయత్నించి ఔటయ్యాను. నా దృష్టిని మరల్చి నా అవుట్ కు ధోని కారణమయ్యాడు అని ఒక వింత వాదనను గంభీర్ తెరపైకి ఇప్పుడు తేవడం నిజంగా ఆశ్చర్యకరమే. సెంచరీ చేయమని ప్రోత్సహిస్తే కూడా తప్పంటున్నట్లు గంభీర్ మాట్లాడడం ఏంటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KuQDqk

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...