Skip to main content

మహేష్, త్రివిక్రమ్ కు పూర్తిగా చెడిపోయినట్టేనా?

No More Good relations between Trivikram Srinivas and Mahesh Babu
No More Good relations between Trivikram Srinivas and Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రెండు అత్యంత ముఖ్యమైన సినిమాలుగా అతడు, ఖలేజాలను పరిగణించవచ్చు. ఈ సినిమాలు రెండూ మహేష్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించాయి. అతడు సినిమాతో తన కెరీర్ లో క్లాసిక్ ను అందుకున్నాడు మహేష్. ఇప్పటికీ ఈ సినిమాకు అదిరిపోయే టిఆర్పి వస్తుంది. ఇప్పటికే వందసార్లకు పైగా టివిలో అతడు టెలికాస్ట్ అయింది. అయినా దానికి క్రేజ్ తగ్గలేదు. ఒక కల్ట్ స్టేటస్ ను అందుకుంది అతడు. అలాగే ఖలేజా సినిమా మహేష్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమాకు ముందు మూడేళ్లు తన కెరీర్ లో గ్యాప్ వచ్చింది. పైగా నటుడిగా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మహేష్. మహేష్ కెరీర్ లో ఖలేజాకు ముందు, తర్వాతగా డివైడ్ చేయవచ్చు. అలాంటి రెండు ఇంపార్టెంట్ సినిమాలను మహేష్ కు అందించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే మహేష్ కు త్రివిక్రమ్ అంటే చాలా రెస్పెక్ట్. ఇప్పటికే చాలాసార్లు మూడోసారి ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకున్నా కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. ఇద్దరూ కలిసి సినిమా చేయకపోయినా మహేష్ నటించిన చాలా యాడ్లకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఆ రకంగా ఇద్దరూ క్లోజ్ గా ఉండేవాళ్ళు. కొన్నేళ్ల క్రితం తుఫాను బాధితుల సహాయార్ధం టాలీవుడ్ అంతా కలిసివచ్చి చేసిన మేము సైతం కార్యక్రమంలో మహేష్, త్రివిక్రమ్ కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేసారు. ఆ సందర్భంగా ఇద్దరూ ఎంత క్లోజ్ అనేది ప్రేక్షకులకు కూడా అర్ధమైంది.

చూస్తుంటే ఇప్పుడు ఇద్దరి మధ్యా బాగా గ్యాప్ వచ్చినట్లు అనిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన వ్యవహారాల బట్టి త్రివిక్రమ్ తో మహేష్ కు పూర్తిగా చెడిపోయిందా అనే భావన కూడా కలుగుతోంది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఒకేరోజు విడుదల కానుండడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్, అల వైకుంఠపురములో టీమ్ కావాలనే సంక్రాంతికి తమకు అడ్డం వచ్చారని ఫీల్ అవుతున్నాడట. సరిలేరు నీకెవ్వరు జనవరి 12న విడుదలవుతోంది అని తెలుసుకునే ముందే అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ ప్రకటించిందిట. ఇలా కావాలని తనకు అడ్డం వస్తుండడంతో మహేష్ కూడా గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ త్రివిక్రమ్ ఉండి కూడా ఏం చేయకపోవడం మహేష్ కు మరింత ఆగ్రహం తెప్పించిందిట. నిజానికి అల వైకుంఠపురములో కు సంబంధించి రిలీజ్ డేట్, సాంగ్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ వంటి వాటి విషయాల్లో త్రివిక్రమ్ ప్రమేయం దాదాపు శూన్యమేనట.అయినా కానీ త్రివిక్రమ్ తనతో సంప్రదించకపోవడంపైనే మహేష్ పాయింట్ అవుట్ చేస్తున్నాడట.

ఈ రకంగా ఇద్దరికీ ఇక తెగిపోయినట్లేనని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. త్రివిక్రమ్ తో తన 28వ సినిమాను ప్లాన్ చేసిన మహేష్ ఇప్పుడు ఆ ప్రయత్నాలను కూడా విరమించుకుంటున్నాడట.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CZPylW

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...