Skip to main content

లస్ట్ స్టోరీస్.. కథ మార్చేసారట!

లస్ట్ స్టోరీస్.. కథ మార్చేసారట!
లస్ట్ స్టోరీస్.. కథ మార్చేసారట!

వెబ్ సిరీస్ లు ప్రస్తుతం మారుతున్న డిజిటల్ యుగంలో ఒక విప్లవం. సినిమాకు ఎంత మాత్రం తీసిపోని టెక్నాలజీతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ లు సరిగ్గా ప్లాన్ చేసి తీస్తే నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఇప్పటికే హిందీలో చాలానే వెబ్ సిరీస్ లు మన ముందుకు వచ్చాయి. లస్ట్ స్టోరీస్, మీర్జాపూర్, సాక్రెడ్ గేమ్స్, ఫ్యామిలీ మ్యాన్.. ఇలా ఎన్నో హిందీ వెబ్ సిరీస్ లు దేశవ్యాప్తంగా సక్సెస్ అవుతున్నాయి. ఇవి సబ్ టైటిల్స్ తో పాటు వస్తాయి కాబట్టి అన్ని భాషల వాళ్ళూ భేషుగ్గా చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ మధ్య ఈ వెబ్ సిరీస్ ల ట్రెండ్ తెలుగులో కూడా ఊపందుకుంది. ఇప్పటికే తెలుగులో పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఉన్నా కొంచెం ఎఫెక్టివ్ గా, సీరియస్ గా సాగే వెబ్ సిరీస్ గా గాడ్స్ ఆఫ్ ధర్మపురి నిలిచింది. ఒక పది ఎపిసోడ్లు ప్లాన్ చేసుకోవడం.. ప్రతి ఎపిసోడ్ లో చివర్లో మంచి టైమింగ్ దగ్గర ఎండ్ చేయడం.. ఇలాంటి వ్యవహారాలతో వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. చిన్న నటులే కాక పేరున్న వారు కూడా ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం. జగపతి బాబు లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్ లో నటించేసారు. ఈ మధ్య సందీప్ కిషన్ కూడా ఫ్యామిలీ మ్యాన్ లో ఒక పాత్ర వేసాడు. ఇప్పుడు సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హిందీలో సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ను తెలుగులో తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

నాలుగు భాగాలుగా తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ ను ఒక్క పార్ట్ ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తాడు. అలాగే తెలుగులో దీనికోసం సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ లు ఎంపికయ్యారని, షూట్ కూడా మొదలైందని తెలుస్తోంది. లస్ట్ స్టోరీస్ అనగానే అందులో కియారా ఎపిసోడ్, అందునా వైబ్రేటర్ సీన్ ప్రేక్షకులకు గుర్తొస్తాయి. సెన్సార్ లేని కారణంగా ఎలాగైనా ఈ వెబ్ సిరీస్ ను తీసుకొనే స్వేచ్ఛ ఉండడం కూడా కలిసొస్తోంది ఇలాంటి సీన్లు తీయడానికి. ప్రస్తుతం కియారా పాత్రకు తెలుగులో ఈషా రెబ్బ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఖండించింది ఈషా.

ఒకసారి వెబ్ సిరీస్ రూపొందించాక మళ్ళీ అదే ఎలా తీస్తారని ఆమె ప్రశ్నించింది. కథ మొత్తం వేరని క్లారిటీ ఇచ్చింది. ఆమె సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తోందిట. ఇప్పటికే సంకల్ప్ రెండు ఎపిసోడ్స్ షూట్ చేసి ఇచ్చాడని ఈషా తెలిపింది. ఈ ఎపిసోడ్స్ లో ఈషాతో పాటు సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కూడా నటించినట్లు ఆమె తెలిపింది. అయితే మిగతా ఎపిసోడ్స్ ను ఎవరు రూపొందిస్తున్నారో తనకు తెలియదని, ఈ విషయంలో తాను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని ఈషా తెలిపింది. ఆమె నటించిన రాగల 24 గంటల్లో మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XCihac

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...