Skip to main content

సరికొత్త టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్న రోజా

సరికొత్త టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్న రోజా
సరికొత్త టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్న రోజా

మాజీ నటి రోజా, రాజకీయ నాయకురాలిగా ఇంత ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట ఆమెను అందరూ ఐరన్ లెగ్ అనే సంబోధించేవారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమనే ప్రచారం గట్టిగా చేసారు. ఇంకా దిగజారుడుగా ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్లే వైఎస్సార్ మృతి చెందారని, అదంతా ఆమె ఐరన్ లెగ్ మహిమేనని కొంతమంది వ్యాఖ్యానించారు. టిడిపిలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఓడిపోవడం, వైఎస్సార్సీపీలోకి వచ్చాక జగన్ ఓటమి పాలు కావడంతో ఇదే భావన జనాల్లో బలంగా నాటుకుపోయింది. అయితే రోజా వాటికి బెదరకుండా పట్టుదలగా ప్రయత్నించింది. 2014లో ఆమె నగరి నుండి పోటీ చేసి గెలుపొందనా టీడీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో ఆమె ప్రతిపక్షానికే పరిమితమయింది. అయితే 2019లో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. వైఎస్సార్సీపీ అఖండ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది. జగన్ పార్టీలో కీలక వ్యక్తి అయిన రోజాకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అంతా ఆశించారు.

అయితే ఆ జిల్లాలో ఉన్న సమీకరణాల నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. అయితే జగన్ ఆమెను వదిలేయలేదు. ఏపీఐఐసీకి చైర్మన్ గా రోజాను నియమించారు. కీలక పదవి లభించడంతో రోజా అసంతృప్తి కొంత చల్లారినట్లే అనుకోవచ్చు. అయితే రోజా మాత్రం దీంతో సంతృప్తి పాదాలనుకోవట్లేదు. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి జిల్లాలో ఉన్న సమీకరణాలు ఒక కారణమైతే, ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలవడం మరొక కారణంగా ఆమె భావించింది. నిజానికి రోజా 2019 ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. మొదట చాలా రౌండ్లలో ఆమె వెనుకంజలోనే ఉంది. దీంతో రోజా ఓటమి ఖాయమనే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా రోజా పుంజుకుని చివరికి నగరిని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో నియోజకవర్గాన్ని ఎక్కువ పట్టించుకోకపోవడమే మెజారిటీ తగ్గడానికి ఒక కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గప్రజలకు అందుబాటులో ఉండకుండా షో లు చేసుకోవడం ఏంటని అక్కడి ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోగా దానివల్లే ఆమె మెజారిటీ తగ్గినట్లు తెలుస్తోంది.

అయితే రోజా సన్నిహిత వర్గాల్లో మరో వాదన ఉంది. 2014లో రోజా ప్రతిపక్ష పార్టీ అని, అందుకని నియోజిక అభివృద్ధికి అధికార పార్టీ నుండి సరైన సహాయ సహకారాలు అందలేదని వారు చెబుతున్నారు. ఏదేమైనా రోజా ఇప్పుడు తన స్ట్రాటజీలో మార్పు చూపిస్తోంది. జబర్దస్త్ తప్పితే మరో షో ఏదీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఇప్పటికే నగరిలో ఒక ఇల్లు తీసుకుని గృహప్రవేశం కూడా చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని భావన కలిగించడానికే ఇవన్నీ అని తెలుస్తోంది. దీంతో పాటు నియోజకవర్గంలో క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేపట్టి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని అనుకుంటోంది. జగన్ ఇప్పటికే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల వల్ల తనకు ప్రజల్లో అనుకూలత పెరిగితే అది తన మంత్రి అయ్యేందుకు అవకాశాలను పెంచుతుందని ఆశిస్తోంది. మరి రోజా అనుకున్నట్లు జరిగి మంత్రి హోదా ఆమెను వరిస్తుందా?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O4nG6P

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...