Skip to main content

మనకు తెలియని మరో మహా యోధుడి కథ “తానాజీ”

Tanhaji The Unsung Warrior trailer released
Tanhaji The Unsung Warrior trailer released

1670 ఫిబ్రవరి 4 న జరిగిన ఒక సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఒక సినిమా వస్తోంది.  ఒక యుద్ధంలో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్లు మాత్రమే కాదు; ఆ యుద్ధాన్ని  గెలిచేలా చేసినవాళ్లు లేదా గెలవాల్సిన యుద్ధాన్ని వెన్నుపోటుతో ఓడించిన వాళ్లు కూడా ముఖ్యమే. చరిత్ర పుటలలో అనేక గొప్ప యుద్ధాలు ఆ తరువాత అధికారంలోకి వచ్చిన పరాయి పాలకుల యొక్క స్వార్థపూరితమైన కుట్ర వల్ల ప్రస్తుత తరానికి అందకుండా చేయబడ్డాయి.

చరిత్ర విస్మరించిన వీరులలో ఒకానొక మహా యోధుడు సుబేదార్ తానాజీ మాల్సారి. ఆ అద్భుతమైన యోధుడి కథను ప్రస్తుతం వెండితెరపైకి తీసుకొస్తున్నారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. ఓం రౌత్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న  ఈ సినిమాని అజయ్ తన స్వీయనిర్మాణంలో చేస్తూ ఉండగా, అతని నిజ జీవిత భాగస్వామి అయిన కాజోల్ ఈ సినిమాలో అతని భార్యగా నటిస్తోంది. చాలా కాలం తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఒక శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ప్రస్తుతం రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తోంది.  ఇటీవల రిలీజైన మరొక యుద్ధం నేపథ్య చిత్రం అయిన “పానిపట్” సినిమా కన్నా, ఈ సినిమా పదిరెట్లు అద్భుతంగా మరియు గొప్పగా ఉందని సినిమా అభిమానులు, ప్రేక్షకులు చెబుతున్నారు.

ఇక ఈ కథ విషయానికి వస్తే,  మొగల్ చక్రవర్తులు ఉత్తర భారతదేశానికి ఢిల్లీ ఎలా రాజధాని గా ఉందో;  అలాగే దక్షిణ భారత దేశానికి కూడా “కొండానా” అనే ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని, ఆ ప్రాంతంతో పాటు యావత్ దక్షిణ భారత దేశం తమ కింద ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఒకే ఒక వ్యక్తి బ్రతికి ఉండగా భారతదేశంలో ఎటువంటి పరాయి పాలకుల ఆధిపత్యం చెల్లదని వాళ్ళకి ఆలస్యంగా తెలుస్తుంది. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్.

మరాఠా సామ్రాజ్య స్థాపన తో మొదలుపెట్టి యావత్ భారతదేశానికి స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం తో ఉంటాడు చత్రపతి శివాజీ మహారాజ్. “కొండాన” ప్రాంతాన్ని ఆక్రమించడానికి మొగలు సైన్యం తమ వంతు ప్రయత్నం లో ఉండగా ఆ ప్రాంతాన్ని వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడే బాధ్యతను స్వయంగా తీసుకుంటాడు సుబేదార్ తానాజీ.

ఈ నేపధ్యంలో అతను చాలా తక్కువ సైన్యం  అండతోనే అనేకమంది సైన్యం ఉన్న మొగల్స్ తో పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో  యావత్ కొండాన ప్రాంతాన్ని సంరక్షిస్తూ అతను చేసిన యుద్ధం నేపథ్యమే ఈ సినిమా.

నిజం చెప్పాలంటే, 2009లో రిలీజై పెద్ద హిట్ అయిన తెలుగు సినిమా “మగధీర” కథను సుబేదార్ తానాజీ నిజ జీవిత నేపథ్యం నుంచి తీసుకున్నామని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాహాటంగానే చెప్పారు. ఒక్కడు సవాల్ చేసి 100 మందిని చంపడం అనే సంఘటన నిజజీవితంలో చేసి చూపించిన వ్యక్తి సుబేదార్ తానాజీ.  ఇక ఈ ట్రైలర్ లో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క అణుబాంబు లాగా ఉంది.

సుబేదారి తానాజీ తన సైన్యంతో చెప్పిన ఒక డైలాగ్  ఉదాహరణకి చెప్పుకుంటే

ఒక ధూళి కణం లో ఎలా అయితే పర్వతం దాగి ఉంటుందో
ఒక విత్తనం లో ఎలా అయితే ఒక మహా అరణ్యం దాగి ఉంటుందో
ఒక వీరుడి ఖడ్గం లో ఎలా ఒక మహాయుద్ధం దాగి ఉంటుందో;  అలాగే ఒక మరాఠా యోధుడు ఒక్కొక్కడి లోనూ కొన్ని లక్షలమంది యోధుల స్ఫూర్తి ఉంటుంది.

ఈ సినిమా వచ్చే సంవత్సరం 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

చివరిగా ఒక మాట చెప్పాలంటే; యుద్ధంలో మనుషులు ఉండటం కాకుండా ఒక మనిషిలో యుద్ధం ఉంటే, ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన రా..రా..రా ..రా  అనే పాట వింటే గూస్ బంప్స్ గ్యారంటీ. ఒక్క సారి ట్రై చేయండి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ra2DGY

Comments

  1. https://www.tollywood.net/telugu/tanhaji-the-unsung-warrior-trailer-released/

    you copy cats

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...