Skip to main content

కీరవాణి పుత్రుల కోసం జూ.ఎన్.టి.ఆర్ రంగం లోకి దిగారు

కీరవాణి పుత్రుల కోసం జూ.ఎన్.టి.ఆర్ రంగం లోకి దిగారు
కీరవాణి పుత్రుల కోసం జూ.ఎన్.టి.ఆర్ రంగం లోకి దిగారు

తెలుగు పరిశ్రమలో సంగీత ప్రపంచం విషయానికి వస్తే ఒక లెజెండరీ గా చరిత్రలో నిలిచి పోయే పేరు. ‘ఎం.ఎం.కీరవాణి’ గారు. దాదాపు దశాబ్ద కాలాల నుండి అనేక సినిమాలకి అందించిన సంగీతం మరువరానిది. ఎస్.ఎస్.రాజమౌళి గారి ప్రతి సినిమాలలో కీరవాణి గారి సంగీతం ఉంటుంది అంటే అది రాజమౌళి గారు కీరవాణి గారికి ఇచ్చిన మొదటి ప్రాధాన్యత. ఒడిదుడుకులు లేని ప్రయాణం కొనసాగించిన సంగీత దర్శకులుగా తెలుగు చరిత్రలో నిలిచిపోయారు కీరవాణి గారు.

ఇక కీరవాణి గారి సంగీత వారసుడిగా (మొదటి కుమారుడు) ‘కాల భైరవ’ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటుడిగా కూడా అడపాదడపా సినిమాలో కనిపించేవారు. ఇక సంగీత విభాగానికి సంపాందించిన పలు వాటిలో తండ్రికి దగ్గ వారసుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. గాయకుడిగా ఇప్పటి వరకు 35 సినిమాలకు పనిచేసిన కాల భైరవ సంగీత దర్శకులుగా రాబోవు సినిమాలకు పనిచేస్తున్నారు. ‘మత్తు వదలరా’, ‘ఆకాశవాణి’ వంటి విభిన్నమైన కాన్సెప్ట్ బేసిడ్ కి తనదైన శైలిలో సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక కీరవాణి గారి రెండవ కుమారుడు ‘శ్రీ సింహ’ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’ బ్యానేర్ లో ‘శ్రీ సింహ’ హీరోగా నూతన దర్శకులు ‘రితేష్ రానా’ కలిసి పని చేస్తున్న సినిమా పేరు ‘మత్తు వదలరా’. అప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వారు ‘మత్తు వదలరా’ సినిమా పోస్టర్ ని విడుదల చేసారు. హీరో, హీరోయిన్స్ విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు. కానీ కీరవాణి గారి రెండవ కుమారుడు అయిన ‘శ్రీ సింహా’ అని ఎవరికీ తెలియదు. ఇక ఈ సినిమాతోనే పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

శ్రీ సింహా ఉన్న ‘మత్తు వదలరా’ కొత్త పోస్టర్ ని విడుదల చేయడానికి మన యంగ్ టైగర్ ‘జూ.ఎన్.టి.ఆర్‘ రంగంలోకి దిగారు. కీరవాణి ఇద్దరు కుమారులని దీవించడానికి, సినిమాకి ముందుగా అల్ ది చెప్పడానికి కీరవాణి గారు ఇలా పథకం వేసారు. ఇక అతిధిగా వచ్చిన జూ.ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ”కాల భారవి, శ్రీ సింహా ఇద్దరు నాకు సోదరులు లాంటివాళ్లు. చూస్తుండగానే ఇరువురు బాగా పెద్దవారు అయిపోయారు. ఒకరేమో సినిమాకి సంగీత దర్శకులుగా, మరొకరేమో హీరోగా కలిసి పని చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా పోస్టర్ ని నేను విడుదల చేయడం నాకు అందంగా ఉంది” అని వేడుక మీద మాట్లాడారు.

ఇక జూ.ఎన్.టి.ఆర్ గారు విడుదల చేసిన పోస్టర్ లో శ్రీ మురళి గారు న్యూస్ పేపర్స్ మీద మత్తుగా పడి ఉండటం, ఆయన వీపు వెనకాల టి-షర్ట్ మీద సినిమా విభాగానికి సంబందించిన వారి పేర్లు ఉండటం. పోస్టర్ లోని పేపర్ ని బాగా గమనిస్తే ‘నూతన పరిచయం శ్రీ సింహ’ అని పిల్లవాడిగా ఉన్నప్పటి శ్రీ సింహా ఫోటో పక్కన, జూ.ఎన్.టి.ఆర్ గారు ఆశ్యర్య పోతున్న ఫోటో ఒకటి ఉంది. కాన్సెప్ట్ బేసిడ్ గా రానున్న ఈ సినిమాని నవంబర్ చివరి వారం లో విడుదల చెయ్యాలని భావిస్తున్నారు నిర్మాతలు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BHA05C

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...