Skip to main content

అనుకున్నట్టే జరుగుతుంది విజయశాంతి గారి విషయంలో

అనుకున్నట్టే జరుగుతుంది విజయశాంతి గారి విషయంలో
అనుకున్నట్టే జరుగుతుంది విజయశాంతి గారి విషయంలో

వరుస 4 సినిమాల విజయం తర్వాత దర్శకులు ‘అనిల్ రావిపూడి’ గారి 5 వ సినిమా 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 న లేదా 12 న విడుదల అవ్వబోతుంది. ఆ సినిమా పేరు ‘సరిలేరు నీకెవ్వరూ’. సూపర్ స్టార్ ప్రిన్స్ ”మహేష్ మహేష్” గారు కథా నాయకులు. మహేష్ బాబు గారి కెరీర్ లో 26 వ సినిమాగా తెరకెక్కబోతుంది సరిలేరు నీకెవ్వరూ సినిమా. అనిల్ రావిపూడి – మహేష్ బాబు గారి మొదటి కలయికలో రానున్న ఈ సినిమా మీద ప్రజలందరికి ఆసక్తికరంగానే ఉంది.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఒకప్పటి ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా కథా నాయిక ‘విజయ శాంతి’ గారు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు – విజయశాంతి గారి కలయికలో ఇదివరకు 2,3 సినిమాలు వచ్చాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ఈ సినిమాకి పని చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాకి నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు మరియు మహేష్ బాబు వారి ముగ్గురి సొంత నిర్మాణ సంస్థలు కలిసి భారీగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న గారు ఈ సినిమాలో కథా నాయికగా తొలిసారి మహేష్ బాబు గారికి జోడిగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మహేష్ బాబు గారి పుట్టిన రోజున, ఆగస్టు 15 పర్వదినాన, దసరా పండుగ కానుకగా ఇలా వరుసగా ఎదో ఒక పండుగ రోజున సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి మొదటి పోస్టర్, మొదటి పాట, మహేష్ బాబు గారికి సంబందించిన స్టిల్స్ అంటూ ఒకొక్కటిగా విడుదల చేసుకుంటూ వచ్చారు సినిమా యూనిట్ వాళ్ళు. ఇక రాబోవు దీపావళి పండగకి కూడా ఇంకొక ట్రైలర్ కానీ, పోస్టర్ కానీ విడుదల చేయబోతున్నాము అని దర్శకులు అనిల్ రావిపూడి గారు తన ట్విటర్ నుండి “దీపావళికి మీరు అందరూ సిద్దంగా ఉండండి” అని ఒక వార్త బయటికి వచ్చింది. ఆ ట్విటర్ వార్త లో చెస్ బోర్డు మీద రాజు ఒక్కడే నిలబడి ఉన్నారు, మిగిలిన వారు కుప్పకూలి పోయారు అని సింబాలిక్ గా ఒక ఫోటో కూడా అప్లోడ్ చేసారు.

ఇక ట్విటర్ లో పోస్ట్ చూసిన మహేష్ బాబు అభిమానులు ఎలా అయితే మహేష్ బాబు కొత్త పోస్టర్ గురించి ఎదురుచూస్తున్నారో? అంతకంటే ఎక్కువగా విజయశాంతి గారి లుక్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు విజయశాంతి గారి అభిమానులు. ఇది తెలుసుకున్న కొంతమంది నెటిజన్లు మహేష్ బాబు – విజయశాంతి ఇద్దరిలో మీరు ఎవరి కొత్త లుక్ కోసం ఎదురుచూస్తున్నారు? అని ఓటింగ్ పెడితే ఎక్కువ మంది విజయశాంతి గారికి ఓట్లు వేసారు. కారణం ఇప్పటికీ మహేష్ బాబు గారికి సంబందించిన స్టిల్స్ మాద్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాము. కానీ విజయశాంతి గారి స్టిల్స్ మాత్రం ఇంకా విడుదల అవ్వలేదు. అందువలన విజయశాంతి గారికి ఓట్లు ఎక్కువ పడ్డాయి.

ఇక జనాల ఇష్టం మేరకు సినిమా బృందం వారు విజయశాంతి గారికి సంబందించిన స్టిల్స్ దీపావళి పండగ రోజున విడుదల చేయబోతున్నారు అని నిర్మాత ‘దిల్ రాజు’ గారి ఆఫీసు నుండి ఎక్కువగా వినిపిస్తున్న మాట. మరి ఇందులో ఎంత నిజం ఉందో? లేదో? అనేది పక్కన పెడితే చాలా కాలం తర్వాత విజయశాంతి గారు తెలుగు తెర మీద కనపడుతున్నారు కాబట్టి విజయశాంతి గారికి సంబందించిన ఫోటో లు విడుదల చేస్తే మంచిది అని అందరూ అనుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35ZZ1Hl

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...