Skip to main content

బిగ్ బాస్ లో కఠిన పరీక్షలు – ఆ ఇద్దరికీ ఇక కష్టమే

బిగ్ బాస్ లో కఠిన పరీక్షలు - ఆ ఇద్దరికీ ఇక కష్టమే
బిగ్ బాస్ లో కఠిన పరీక్షలు – ఆ ఇద్దరికీ ఇక కష్టమే

ఈసారి బిగ్ బాస్ పై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు కఠినమైన టాస్క్ లు ఇవ్వట్లేదని, ఊరికే కూర్చోబెట్టి షో ను నడిపిస్తున్నారని ఏదేదో అన్నారు. దానికి తోడు కంటెస్టెంట్స్ కూడా తమకసలు షో లో ఉండటమే ఇంట్రెస్ట్ లేదన్నట్లుగా ప్రవర్తించారు. ఎంత సేపు సేఫ్ గేమ్ ఆడుకుంటూ, గట్టిగా ఒక తప్పును ప్రశ్నిస్తే ఏమవుతుందోనన్న భయంతో ప్రవర్తించడం వంటివి చేసారు. దీనికి తోడు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున కూడా షో ను చూడకుండా ఒక స్క్రిప్ట్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్లడం, తప్పు చేసిన వాళ్ళని గట్టిగా నిలదీయకపోవడం, కొంత మంది దగ్గర ఫెవరెటిజం చూపించడం వంటివి చేయడంతో చాలా మందికి షో మీద ఆసక్తి సన్నగిల్లింది.

అయితే ఇక షో కంప్లీట్ అవ్వడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలుంది. షో లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో నుండి ఇప్పటికే రాహుల్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. దీంతో మిగిలిన ఐదుగురు లో నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు. బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, శివ జ్యోతి, అలీ రెజా నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే షో ఎండింగ్ కు వస్తున్న సమయంలో బిగ్ బాస్ లో ఆసక్తికర టాస్క్ లు మొదలయ్యాయి. నామినేషన్స్ ప్రాసెస్ అత్యంత కఠినతరంగా నిర్వహించగా, నిన్న ఎపిసోడ్ లో నామినేట్ అయిన సభ్యులకు కఠిన పరీక్షలు నిర్వహించారు.

ఇందులో భాగంగా నామినేట్ అయిన సభ్యులను ఒక బూత్ లో నిలబెట్టి మొత్తం 5 టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఒక్కోసారి ఒక్కొక్క నామినేట్ సభ్యుడు టాస్క్ ను బట్టి ఎంచుకోవచ్చు. ముందుగా ఇచ్చిన టాస్క్ ప్రకారం.. ఒక రాడ్ ఇచ్చి దాన్ని ఎదురుగా ఎత్తుగా ఉన్న రింగ్ అంచులకు తాకకుండా నుంచోవాలి. రాడ్ ఎత్తుగా ఉండడం, కొంచెం రింగ్ కు తాకినా మంటలు వస్తుండడంతో ఈ టాస్క్ కఠినతరం అనే చెప్పాలి. బిగ్ బాస్ చెప్పే వరకూ ఈ టాస్క్ చేస్తూనే ఉండాలి. ఈ టాస్క్ చేయడానికి వరుణ్ సందేశ్ ముందుకు వచ్చాడు.

ఇక తర్వాత టాస్క్.. ఒక లావుగా ఉన్న పోల్ పెట్టి దానిపై నిలబడాలి. బిగ్ బాస్ చెప్పేవరకూ దాన్నుండి దిగకూడదు. పోల్ పై కాళ్ళు పెట్టుకునే స్థలం చిన్నగా ఉండడం, పోల్ ను చుట్టుకుని పట్టుకోవడానికి, అది చాలా లావుగా ఉండడంతో ఇది కూడా కష్టంగానే అనిపించింది. ఈ టాస్క్ చేయడానికి బాబా భాస్కర్ ముందుకు వచ్చాడు. ఇక మూడో టాస్క్.. పాళ్ళలో గుడ్లు వేసుకుని తాగాల్సి ఉంటుంది. బిగ్ బాస్ చెప్పేవరకూ తాగుతూనే ఉండాలి. ఈ టాస్క్ చేయడానికి శివజ్యోతి ముందుకు వచ్చింది. నాలుగో టాస్క్ రెండు ఇసుక మూటల్ని రెండు చేతులతో రెడ్ లైన్ కిందకు దిగకుండా పట్టుకుని ఉండాలి. ఈ టాస్క్ చేయడానికి అలీ రెజా ముందుకు వచ్చాడు. చిట్టచివరి టాస్క్ గా ఒక చేప నోట్లో మౌత్ ఆర్గాన్ పెట్టి దాన్ని బిగ్ బాస్ చెప్పే వరకూ ఊదుతూ ఉండాలి. మిగిలి ఉన్న శ్రీముఖి ఈ టాస్క్ ను మొదలుపెట్టింది.

బిగ్ బాస్ చాలా సేపటి వరకూ ఈ టాస్క్ ను అలాగే కొనసాగించాడు. తర్వాత ఒక్కొక్కరిగా ఈ టాస్క్ నుండి రిలీజ్ చేసారు. అందరూ బిగ్ బాస్ చెప్పేవరకూ ఎంత కష్టమైనా వారి టాస్క్ లు కొనసాగించడం విశేషం. ఇలాంటి టాస్క్ లు షో ముందు నుండి ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదిగా అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక హౌజ్ లో నామినేట్ అయిన సభ్యులు అందరూ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా అలీ రెజా, శివజ్యోతి మధ్య ఎలిమినేషన్ కోసం టఫ్ కాంపిటీషన్ ఉంటుందని అర్ధమవుతోంది. మిగిలిన నామినేటెడ్ సభ్యులు శ్రీముఖి, వరుణ్, బాబా దాదాపు సేవ్ అయిపోయినట్లే. మరి అందరూ అనుకుంటున్నట్లు అలీ, శివ జ్యోతిలలో నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారా లేక సేవ్ అవుతారన్న ముగ్గురిలో నుండి ఒకరు వెళిపోతారా అన్నది చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2N7hw3Z

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...