Skip to main content

నరేంద్ర మోదీ నుండి పిలుపు అందుకున్న చిరు.. ఉపాసన ఎఫెక్టేనా?

నరేంద్ర మోదీ నుండి పిలుపు అందుకున్న చిరు.. ఉపాసన ఎఫెక్టేనా?
నరేంద్ర మోదీ నుండి పిలుపు అందుకున్న చిరు.. ఉపాసన ఎఫెక్టేనా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు వారు బానే ఆదరించారు. చిరంజీవి సైతం ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడు. సినిమాకు వచ్చే లాభాల కంటే ఈ సినిమా ద్వారా వచ్చే గౌరవాన్నే ఎక్కువ కోరుకుంటున్నాడు చిరంజీవి. అందుకే ఈ చిత్రాన్ని రాజకీయ నాయకులకు చూపించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళశై కు చూపించగా, ఆమె ఈ చిత్రాన్ని పొగిడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కూడా సినిమా చూడమని విజ్ఞప్తి చేయడానికి చిరు ఇటీవలే కలిసిన విషయం తెల్సిందే. ఆయన కూడా చూస్తానని సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని జగన్ చూసే అవకాశముంది.

వీటికి తోడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సైరాను చూసి చిరంజీవి, చరణ్ ను కలిసి అభినందించారు. తెలుగువారి సత్తా మరోసారి ఈ చిత్రం ద్వారా తెలుస్తుందని కొనియాడారు. ఇక చిరంజీవి ఈ చిత్రాన్ని నరేంద్ర మోదీకి చూపించడానికి కూడా ప్రయత్నించాడు. గత వారం ఇందుకోసమే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా అది ఫలించలేదు. ప్రధానమంత్రి హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా ప్రచార పనుల్లో బిజీగా ఉండడంతో అపాయింట్మెంట్ ఇవ్వడం కుదర్లేదు.

అందుకే ప్రధానమంత్రి కార్యాలయం నుండి చిరంజీవి, రామ్ చరణ్ లకు కబురందింది. ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వీరిద్దరూ కలవబోతున్నారు. ప్రచార కార్యక్రమాలు ముగియడంతో మర్చిపోకుండా చిరంజీవిని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది సంతోషకర విషయంగా పరిగణిస్తున్నారు కొంత మంది. అయితే మరికొంత మంది దీనికి మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవలే మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా సినీ ప్రముఖులను కలిసిన నరేంద్ర మోదీ.. అందులో సౌత్ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వలేదని చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా వేదికగా విమర్శించిన సంగతి తెల్సిందే. సినీ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని సౌత్ ఇండస్ట్రీ కూడా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. సౌత్ నుండి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక్కరికే ఆహ్వానం అందిన విషయం తెల్సిందే. అయితే ఈ విషయంపై మోదీ మీద విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగిన మోదీ ఇప్పుడు చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చాడని అంటున్నారు.

సౌత్ ఇండస్ట్రీని గుర్తించే వ్యక్తి అయితే సినీ ఇండస్ట్రీని కలిసినప్పుడు సౌత్ నుండి కూడా ప్రాధాన్యత కల్పించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇదంతా ఉపాసన ఎఫెక్ట్ వల్లే జరిగిందా? లేక మోదీ గుర్తించుకుని చిరంజీవి, చరణ్ లకు ఆహ్వానం అందించారా అన్నది తెలియాల్సి ఉంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MHzzP5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...