Skip to main content

ఎంతైనా ‘త్రిష’ ఉంటేనే వేరబ్బా సినిమాలో…

ఎంతైనా 'త్రిష' ఉంటేనే వేరబ్బా సినిమాలో
ఎంతైనా ‘త్రిష’ ఉంటేనే వేరబ్బా సినిమాలో

మొదట తమిళ పరిశ్రమలో సినిమాలు చేసుకుంటూ బాగా పేరు తెచ్చుకున్న ‘త్రిష’ తెలుగులో మొదటి సినిమాగా యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్‘ సరసన ‘వర్షం’ సినిమా ద్వారా  పరిచయం అయ్యారు. త్రిష నటనకి మొదటి సినిమాకే ‘ఫిలిం ఫేర్ అవార్డు’ దక్కింది. నటన పరంగా అందరినుండి మంచి మార్కులు వేసుకున్న త్రిష తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో అభిమానులని సొంతం చేసుకుంది.

అప్పటికి తనకి పోటీగా నయనతార, శ్రియా శరన్, అనుష్క శెట్టి, ప్రియమణి లాంటి వారు అందం, అభినయం ప్రదర్శించించి హాట్ హీరోయిన్స్ గా వారి అభిమనులకి దగ్గర అవుతుంటే త్రిష మాత్రం అందుకు విభిన్న౦గా ఉంటూ, వచ్చిన అవకాశాలని చేసుకుంటూ వెళ్తుంది. బాలీవుడ్ లో మాత్రం త్రిష కోరిక నెరవేరలేకపోయింది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు అన్ని బోల్తా కొట్టాయి. నాగ చైతన్య – సమంత కలిసి మొదటి సారి నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాని తమిళంలో సమంత చేసిన పాత్ర చేసింది త్రిష. దర్శకులు కూడా ఒకలే రెండు సినిమాలకి.

గత సంవత్సరం త్రిష తమిళంలో ’96’ సినిమాని చేసింది. ఆ సినిమా తమిళంలో బాగా విజయం సాధించింది. అందుకే ఆ సినిమాని దిల్ రాజు గారు నిర్మాతగా తెలుగు రీమేక్ రైట్స్ ని కొనేసారు. కట్ చేస్తే అక్కడ త్రిష చేసిన పాత్రని ఇప్పుడు తెలుగులో సమంత గారు చేస్తున్నారు. 9 సంవత్సరాల క్రితం తెలుగులో సమంత చేసిన పాత్రలో తమిళంలో  త్రిష చేసింది. ఇప్పుడు తమిళంలో త్రిష చేసిన పాత్రలో తెలుగులో సమంత చేస్తుంది. ఇకపోతే త్రిషకి మళ్ళీ తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆమె 2016 లో తెలుగులో ‘నాయకి’ సినిమా చేసింది. ఆ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాపు అయ్యింది. అందువలన తెలుగులో మళ్ళీ సినిమాలు చేయలేదు. తెలుగు నిర్మాతలు కూడా త్రిషకి మళ్ళీ అవకాశాలు ఇవ్వలేదు.

చిరంజీవి-కొరటాల శివ కలయికలో వస్తున్న సినిమాలో మొదట త్రిష పేరే వినిపిస్తుంది. అప్పటికి త్రిష, చిరంజీవి గారు ‘స్టాలిన్’ సినిమాలో కలిసి నటించారు. క్లాసిక్ మూవీస్ కి పెట్టిన పేరు ‘మణిరత్నం’ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా త్రిష గారి పేరు వినిపిస్తుంది. ఆ సినిమా తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి విడుదల చేస్తారు. ‘పొన్నియిన్ సెల్వం’ పేరుతో మణిరత్నం గారు ఒక పీరియాడిక్ సినిమాని చేస్తున్నారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాలో  “విక్రమ్,  కీర్తి సురేష్, జయం రవి, కార్తీ, మోహన్ బాబు, పార్తిబన్, ఐశ్వర్య రాయి, అమలా పాల్, జ్యోతిక” లాంటి వారు పెద్ద తారాగణం నటిస్తుంది.

ఇక వారితో త్రిష కూడా కలిస్తే సినిమాకి త్రిష వలన సినిమాకి బలం అవుతుంది. ఎందుకంటే అంతమందితో కలిసి నటించడం అంటే త్రిష కి మంచి బూస్ట్ అప్ దొరికినట్టే. ఒకవేళ నిజంగానే త్రిష గారు కనుక ఈ సినిమా చేస్తే ఆమెకి మరింత అభిమానులు పెరిగే అవకాశం లేకపోలేదు. రచయిత ‘కల్కి కృష్ణ మూర్తి’ రాసిన చోళుల చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం గారు పొన్నియిన్ సెల్వం సినిమాకి తగిన విధంగా పలు మార్పులు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న త్రిష అభిమానులు ఎంతైనా ఇలాంటి పాత్రలో త్రిష గారు నటిస్తే చూడడానికి రెండు కళ్లు చాలవు అని అనుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JfHMYW

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...